Ponnam Prabhakar : ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలి
- ఆరోగ్యశ్రీ నిలిపివేత పేదలకు తీవ్ర ఇబ్బంది.. మంత్రి పొన్నం ప్రభాకర్
- 3 ప్రభుత్వం ఇప్పటికే 21 నెలల్లో ₹1,779 కోట్లు చెల్లించింది
- కొత్తగా 163 వైద్య సేవలు ఆరోగ్యశ్రీలో చేరిక
- రెండు రోజుల్లోనే ₹100 కోట్లు విడుదల.. పెండింగ్ విడతల వారీగా చెల్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ హాస్పిటల్స్ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో హాస్పిటల్ యాజమాన్యాలు వెంటనే వెనక్కి తగ్గి, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకువచ్చిందని చెప్పారు. ఐదు లక్షల ఉచిత వైద్య పరిమితిని పది లక్షలకు పెంచడంతో పాటు, గత 21 నెలల్లో ₹1,779 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్కి చెల్లించిందని వివరించారు.
Also Read
- Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
- Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతే 1,375 వైద్య చికిత్సల చార్జీలు సగటున 22% పెంచబడినట్లు, అలాగే కొత్తగా 163 ఖరీదైన వైద్య సేవలు ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు మంత్రి గుర్తుచేశారు. దీంతో పేదలకు మరింత వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కొత్త ప్యాకేజీల వల్లే ప్రభుత్వం అదనంగా ₹487.29 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు ₹57 కోట్లు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించినట్లు మంత్రి వివరించారు.
ఇప్పటికే రెండు రోజుల్లోనే ₹100 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ ఖాతాలో జమ చేసినట్లు కూడా తెలిపారు. పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ హాస్పిటల్స్ మానవీయ కోణంలో ఆలోచించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు ప్రాణాధారం కావడంతో, వాటిని వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!