Ponnam Prabhakar: ఎస్సీ , ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర..
Ponnam Prabhakar: బీజేపీ పొరపాటుగా గెలిస్తే మన రిజర్వేషన్లు , మనతో పాటు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి మద్దతుగా గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ , ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తో గీతా కార్మికునీ బిడ్డగా తెలంగాణ మంత్రిగా అయ్య అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావుని గెలిపించండి.. వారిని ఆశీర్వదించాలన్నారు. మన వాళ్ళకి సమస్య వస్తె మా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రావద్దు అని చెప్పిన అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ,కుటుంబ సభ్యులు మీరు నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారు..మీకు ఎప్పటికీ మీ బిడ్డగా ఉంటా అని తెలిపారు.
Read also: Sanjiv Goenka-KL Rahul: కెమెరాల ముందే అరుస్తారా.. ఇది సిగ్గుపడాల్సిన విషయం!
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
రాజకీయ ,ఉపాధి ,ఆర్థికంగా మీ అందరికీ సహకరిస్తా అన్నారు. వేములవాడ లో మీ అందరి సహకారంతో స్టార్ హోటల్ లాంటి వసతి గృహం నిర్మిస్తున్నామన్నారు. రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్న హుస్నాబాద్ కి అందరూ వచ్చారు..కష్టపడ్డారు..ఎమ్మెల్యే అయ్యాను..జిల్లా మంత్రి అయ్యానన్నారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం ఐక్యంగా ఒక్క తాటి మీద రాజేందర్ రావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచినం అని తెలిపారు. బీజేపీ పొరపాటుగా గెలిస్తే మన రిజర్వేషన్లు , మనతో పాటు ఎస్సి ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. రాజేందర్ రావు గెలిస్తే నేను గెలిచినట్టన్నారు. మంగలి షాపులు బ్యూటి పార్లర్ అయినాయి..కల్లు కాంపౌండ్ లు బార్ లు కావాలన్నారు. సామాజిక ,రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కి ఇంకా బలం కావాలంటే మీ అందరి మద్దతు కావాలని తెలిపారు. నా బలం మరింత పెరగాలంటే రాజేందర్ రావు గారిని గెలిపించండన్నారు.
Read also: Aravind Kejriwal : కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. జూన్ 2న హాజరు కావాలని ఆదేశాలు
మీ అందరికీ రెండు చేతులు జోడించి ఆశీర్వదించాలని కోరుతున్న అని అన్నారు. రాజేందర్ రావు గెలుపు మా అందరి గెలుపన్నారు. రాజేందర్ రావు తండ్రి జగపతి రావు మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేశారన్నారు. నిన్న బండి సంజయ్ మాట్లాడుతున్నారు… రాజకీయ గురువు చొక్కరావు నో ఓడించిన జగపతి రావు గారి కుమారుడు కి మద్దతుగా నిలబడ్డారు అని అంటున్నారని మండిపడ్డారు. జగపతి రావు తెలంగాణ ఉద్యమ కారుడు..ఆయన కుమారుడు రాజేందర్ రావు గారు కూడా ఉద్యమ కారుడే ఆయనేం చొక్కరావు గారి మీద పోటీ చేయడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అమరవీరులకు పార్లమెంట్ లో అవమానకరంగా మాట్లాడితే కనీసం స్పందించని బండి సంజయ్ ను ఎన్నికల్లో ఓడించాలన్నారు.
Chiranjeevi : పిఠాపురం ప్రచారంపై స్పందించిన మెగాస్టార్..
తాజావార్తలు
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!