Vemulawada: వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. దర్గాకు తాళం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అవరణ లో ఉన్న దర్గాలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా దర్గాలో పూజలు చేసేందుకు రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. మేమే ముందునుంచి దర్గాను మెయింటైన్ చేస్తున్నామని, కొందరు మధ్యలో వచ్చి దర్గా అధికారాలు ఇవ్వాలని గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాది నుండి దర్గాపై తమకే హక్కులు ఉన్నాయని ఒక వర్గం, తాతల నాటి నుండి హక్కులు తమకే ఉన్నాయని మరో వర్గం ఇలా కొంత కాలంగా గొడవ జరగడం మళ్లీ సర్దుమనగడం వంటివి జరుగుతూ వస్తుంది. అయితే ఇవాళ ఆ చిన్న గొడవ పెద్దదైంది. ఇరు వర్గాలు దర్గావద్ద గొడవకు దిగారు. రాజన్న ఆలయం వద్దనే దర్గాలో గొడవ జరగడం భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దర్గాకు, ఆలయానికి వచ్చే వారు అందరూ షాక్ తో చూస్తుండి పోయారు. దర్గా మెయింటైన్ పై గొడవలు ఏంటిని ఆశ్చర్యపోయారు. దర్గాపై హక్కులు మావంటే మాదని తోపులాట చోటుచేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Jawan Movie Review: జవాన్ రివ్యూ..
Also Read
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
హుటాహిటిన పోలీసులు రాజన్న ఆలయం వద్ద ఉన్న దర్గా దగ్గరకు వచ్చారు. ఇరు వర్గాలను శాంతింప చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ఓ నిర్ణయం తీసుకున్నారు. గొడవలకు తావులేకుండా దర్గాలో ఎవరు పూజలు చేయాలన్న దానిపై నిర్ణయం వచ్చేంత వరకు ఇరు వర్గాలు లోపలికి ప్రవేశించరాదని తేల్చి చెప్పారు. ఇరు వర్గాలను బయటకు పంపి దర్గాకు తాళం వేశారు. దర్గాపై ఎవరికి హక్కులుంటే వారు సరైన ఆధారాలతో పాటు పత్రాలతో రావాలని పోలీసులు ఇరు వర్గాలను ఆదేశించి దర్గాకు తాళం వేసి, బయట పంపించడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. మరొ కొందరు మస్లీం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్గాలో పూజలు నిర్వహించకుండా తాళం వేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి దీనిపై అధికారులు, గొడవకు దారితీసిన ఆ రెండు వర్గాలు ఏం నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే.
Udayanidhi Stalin: ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షల రివార్డ్.. ఏపీలో పోస్టర్లు..
తాజావార్తలు
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!