Udayanidhi Stalin: ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షల రివార్డ్.. ఏపీలో పోస్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఉదయనిధి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో, ఆ కూటమికి హిందూమతంపై ద్వేషం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే ఉదయనిధి స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ఆయోధ్యకు చెందిన సాధువు ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన జనజాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా అంటించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందుకు ఈ ప్రకటన చేసింది. ఏపీలోని విజయవాడలో ఆ సంస్థ పోస్టర్లు కనిపించాయి.
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
Read Also: Udhayanidhi: ‘నా ప్రకటన తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఏ మతానికి శత్రువు కాదు’
అంతకుముందు చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మ సమాజిక న్యాయభావనకు విరుద్ధమని దానిని నిర్మూలించాలని వివాదాస్పద ఉదయనిధి స్టాలిన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందువులందరిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి.
తాజాగా ఇతని వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. సతనాత వ్యాఖ్యలకు తగిన విధంగా సమాధానం ఇవ్వాలని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇండియా కూటమి స్పందించడం లేదని.. ఇండియా కూటమికి హిందువులంటే ద్వేషం అని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!