Junior Linemen Recruitment Test: లైన్ మెన్ నియామకంలో భారీ స్కామ్.. అదుపులో నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాయి. జూలై 17న జరిగిన రాత పరీక్షలో కొందరు అభ్యర్థులకు సెల్ఫోన్ ద్వారా సమాధానాలు రాయడాన్ని ఘట్కేసర్ లోని ఓ పరీక్షకేంద్రం అధికారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయండో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరాతీయగా నిజాల తెలిసి ఖంగుతున్నారు. అక్కడ సెల్ఫోన్ పరీక్ష రాసింది ఒక్కరేకాదు పదుల సంఖ్యలో అభ్యర్థులు సెల్ఫోన్ల ద్వారా సమాధానాలు వెల్లినట్లు గుర్తించి నిర్ఘాంతపోయాలు.
నగరంలోని మలక్పేటలో విధులు నిర్వహిస్తున్న ఏడీఈ ఫిరోజ్ ఖాన్, కోదాడలో సహాయ ఇంజినీర్ గా పనిచేస్తున్న సైదులు పరీక్ష రాసిన వారికి సమాధానాలు అందజేశారని రాచకొండ పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరి వద్దకు ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో.. మరో నలుగురు విద్యుత్ శాఖ అధికారులను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు విశ్వనీయ సమాచారం.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
కాగా.. నగరంలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అధికారులు నాలుగేళ్లు నుంచి దందా కొనసాగిస్తున్నారని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ భారీ స్కామ్ లో ఇద్దరు సహాయ డిప్యటి ఇంజినీర్లు, నలుగురు సహాయ ఇంజినీర్లు, తొమ్మిది మంది లైన్మెన్లు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులోభాగంగా.. ఏడీఈల్లో ఒకరు ఉమ్మడి నల్గొండ, మరొకరు హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే..వీరిద్దరు నాలుగేళ్ల క్రితం పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
కాగా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 70 అసిస్టెంట్ ఇంజనీర్, వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి మే 9 న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా జూలై 17న గ్రేటర్ హైదరాబాద్లోని పలు కేంద్రాల్లో ఉదయం జూనియర్ లైన్మెన్లకు, మధ్యాహ్నం అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
తాజావార్తలు
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
-
5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..