Junior Linemen Recruitment Test: లైన్ మెన్ నియామకంలో భారీ స్కామ్.. అదుపులో నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాయి. జూలై 17న జరిగిన రాత పరీక్షలో కొందరు అభ్యర్థులకు సెల్ఫోన్ ద్వారా సమాధానాలు రాయడాన్ని ఘట్కేసర్ లోని ఓ పరీక్షకేంద్రం అధికారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయండో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరాతీయగా నిజాల తెలిసి ఖంగుతున్నారు. అక్కడ సెల్ఫోన్ పరీక్ష రాసింది ఒక్కరేకాదు పదుల సంఖ్యలో అభ్యర్థులు సెల్ఫోన్ల ద్వారా సమాధానాలు వెల్లినట్లు గుర్తించి నిర్ఘాంతపోయాలు.
నగరంలోని మలక్పేటలో విధులు నిర్వహిస్తున్న ఏడీఈ ఫిరోజ్ ఖాన్, కోదాడలో సహాయ ఇంజినీర్ గా పనిచేస్తున్న సైదులు పరీక్ష రాసిన వారికి సమాధానాలు అందజేశారని రాచకొండ పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరి వద్దకు ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో.. మరో నలుగురు విద్యుత్ శాఖ అధికారులను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు విశ్వనీయ సమాచారం.
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
కాగా.. నగరంలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అధికారులు నాలుగేళ్లు నుంచి దందా కొనసాగిస్తున్నారని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ భారీ స్కామ్ లో ఇద్దరు సహాయ డిప్యటి ఇంజినీర్లు, నలుగురు సహాయ ఇంజినీర్లు, తొమ్మిది మంది లైన్మెన్లు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులోభాగంగా.. ఏడీఈల్లో ఒకరు ఉమ్మడి నల్గొండ, మరొకరు హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే..వీరిద్దరు నాలుగేళ్ల క్రితం పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
కాగా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 70 అసిస్టెంట్ ఇంజనీర్, వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి మే 9 న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా జూలై 17న గ్రేటర్ హైదరాబాద్లోని పలు కేంద్రాల్లో ఉదయం జూనియర్ లైన్మెన్లకు, మధ్యాహ్నం అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!