Secunderabad: పోలీసులను చూసి భవనం పైనుంచి దూకిన వ్యక్తి.. తరువాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. అయితే ఓ బిల్డింగ్ లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడుకు చేరుకున్నారు. కాగా పోలీసులు వచ్చారన్న సమాచారంతో పేకాట ఆడుతున్న వారందరూ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అందులో ఓ వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్లాలో తెలియక మూడో అంతస్తు భవనం పై నుంచి కిందికి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: కాజల్ బెడ్ రూం ఫోటోస్ వైరల్..
Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
లాలాపేటలోని శాంతినగర్ కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ప్రైవేటు ఉద్యోగి. గురువారం రాత్రి లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఓ భవనంపై కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా పేకాట అడుతున్నారు. అయితే, వినయ్ కుమార్ అనే వ్యక్తి కూడా రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసులను గమనించిన కొందరు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. వినయ్ కుమార్ కూడా తప్పించుకునే ప్రయత్నంలో మూడవ అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలైన వినయ్ ను స్థానికులు అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించగా…చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు కుటుంబంతోనే వున్నాడని, ఎవరో కాల్ చేస్తే వెళ్లొస్తా అంటూ ఇంటి నుంచి వినయ్ బయలు దేరాడని తెలిపారు. కానీ ఇంతలోనే వినయ్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడని వాపోయారు. ఇంటి పెద్దదిక్కుగా వున్న వినయ్ మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Hyderabad: నగరంలో కలకలం.. ఒకే రోజు నలుగురు అదృశ్యం..
తాజావార్తలు
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!