Hyderabad: నగరంలో కలకలం.. ఒకే రోజు నలుగురు అదృశ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలో ఒకే రోజు నలుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వేరు వేరు ప్రాంతంలో ఇద్దరు బాలురు, ఒక యువతి, నవ వధువు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే రోజు నలుగు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు సవాల్ గా మారింది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
జగద్గిరిగి గుట్టలో రోషన్ అనే పదేళ్ల బాలుడు అదృశ్యం అయ్యాడు. ఆడుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. ఎంతసేపటికి రోషన్ ఇంటికి రాకపోవడంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు బయటకు వెళ్లి చూడగా రోషన్ కనిపించలేదు. చుట్టుపక్కన వున్న వాళ్లను అడిగినా రోషన్ ను బయట చూడలేదని చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రోషన్ ను ధర్మవరం రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రోషన్ ను ఎవరైనా తీసుకుని వెళ్లారా? లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Also Read
Read also: Cyber Crime: పోలీసులకు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ.. సీఐ బ్యాంకు ఖాతా ఖాళీ..!
ఇక మరో సంఘటన బాలానగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పదేళ్ల బాలుడు అదృశ్యం కావడం కాలనీ వాసులు భాయాందోళనకు గురవుతున్నారు. ఏపీహెచ్ బీ కాలనీలో తల్లి మందలించిందని కృతిక్ కళ్యాణ్ అనే పదేళ్ల బాలుడు సైకిల్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Read also: Renu Desai: ప్రధాని పక్కన నా కుమారుడు.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!
కాగా.. సూరారం పోలీస్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. సత్యవతి, రమణ దంపతుల కూతురు పార్వతి కనిపించకుండా పోయింది. దీంతో చుట్టు ప్రక్కల, బంధువుల ఇళ్లల్లో వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు.
Read also:Priyanka Gandhi: నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలి.. కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్
ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన నెల రోజులకే నవ వధువు కనిపించకుండా పోవడంతో భర్త షాక్ తిన్నాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఖాజా బాగ్ లో నివాసముండే ముదావత్ సంతోష్ కి ముదావత్ అనితతో మార్చిలో వివాహం జరిగింది. సంతోష్ రోజూలాగేనే ఆఫీస్ కి బయలు దేరాడు. అయితే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. అయితే.. పక్కనే ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని కొద్దిసేపు ఇంట్లో సేద తీరాడు. ఎంతసేపటికి అనిత ఇంటికి రాకపోవడంతో.. బయటకు వచ్చిన సంతోష్ చుట్టుపక్కల, తెలిసిన బంధువుల ఇళ్లలో వెతికినా అనిత ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, భర్త సంతోష్ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీనులు దర్యాప్తు చేస్తున్నారు.
Devendra Fadnavis: నేడు మోడీ, అమిత్ షాతో ఫడ్నవీస్ భేటీ.. రాజీనామాపై చర్చ..!
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..