Sankranthi: పండక్కి ఊరెళ్తున్నారా?.. పోలీసుల సూచనలు ఇవే..!
Sankranthi: మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండటంతో సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు రోజుల పండుగను మరింత సంతోషంగా జరుపుకునేందుకు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు గ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరం సగం ఖాళీగా మారనుంది. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు జరిగే అవకాశాలున్నాయి. అయితే పండుగ పట్టణాలకు వెళ్లే వారికి సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పండుగ సమయంలో ఇళ్లకు తాళాలు వేసి గ్రామాలకు వెళ్తుంటారు. అదే సమయంలో, దొంగలు తమ తెలివిని పని చెప్తుంటారు. ఇళ్లు తాళాలు వేసి ఉంటే చాలు.. తమకు అందిన కాడిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
Read also:Shirdi Sai Baba: గురువారం నాడు సాయిబాబాను ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి
Also Read
ఈ నేపథ్యంలో పండక్కి గ్రామాల్లో నివాసముంటున్న ఇంటి యజమానులు, ప్రజలు తస్మాత్ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఊరెళ్లి అజాగ్రత్తగా ఉండరాదని, ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే వాటిని తీసుకెళ్లాలని లేదా బ్యాంకుల్లో నగదు, బంగారం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మీ టూ వీలర్లను మీ కాంపౌండ్లలో లాక్ చేసి, వీలైతే చక్రాలకు చైన్లను ఉంచడం మంచిది. ఈ విషయాన్ని పక్కింటి వారికి చెప్పాలని లేదా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మీ ఇంటి ముందు చెత్త, పాల ప్యాకెట్లు, వార్తాపత్రికలు, కొంతమంది నేరస్థులు వాటిని గమనించి నేరాలకు జరగవచ్చు వారికి ముందుగానే మీరు ఉండమని సమాచారం ఇవ్వండి. తలుపులు లాక్ చేయబడినందున అపరిచితులకు కనిపించకుండా, లాక్ చేయబడిన తలుపులను కర్టెన్లతో కప్పండి. బయటికి వెళ్లేటప్పుడు ఇంట్లో కొన్ని, బయట కొన్ని లైట్లు ఉంచడం మంచిది. మీరు లేనప్పుడు మీ ఇంటిని చూసుకోమని మీ విశ్వసనీయ పక్కింటి వారికి తెలియజేయడం మంచిదన్నారు.
పోలీసుల ఆదేశాలు..
* ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి.
* ఇళ్లకు వెళ్లే వారు ఇంటి ఆవరణలో లేదా ఇంటి లోపల ఏదో ఒక గదిలో లైట్ వేసుకుంటే మంచిది.
* సెక్యూరిటీ ఉంటే ప్రతిరోజూ వాకిలి ఊడ్చివేయమని చెప్పాలి.
* విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు.
* కారు ట్రంక్లలో విలువైన వస్తువులను మర్చిపోవద్దు.
* విశ్వసనీయమైన వ్యక్తులను వాచ్మెన్గా నియమించడం ఉత్తమం.
* బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు.
* ఆరుబయట ఉంచే వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా ఉండటం మంచిది.
* సీసీ కెమెరాలను అమర్చి వాటిని మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకుంటే మీరు ఎక్కడ ఉన్నా ఇంటి పరిసరాలు, ప్రజల కదలికలపై నిఘా ఉంచవచ్చు.
* తమ పరిధిలో గస్తీ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలన్నారు. వీధి బీట్ కానిస్టేబుల్ నంబర్ దగ్గర పోలీస్ స్టేషన్ నంబర్ ఉంచాలి.
* ప్రజలు నిరంతరం పోలీసులకు సహకరిస్తే దొంగతనాలను నియంత్రించడం చాలా సులభం.
* స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిదన్నారు.
* పోలీసు కాలనీల్లో దొంగతనాలు జరగకుండా స్వచ్ఛంద కమిటీలు వేయాలని సూచించారు. * * కాలనీలలో అనుమానాస్పద వ్యక్తులు మరియు కొత్త వ్యక్తుల సంచారం గురించి తెలియజేయడానికి డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నంబర్ 9490617444 కు కాల్ చేయాలని సూచించారు. ఇవన్నీ ఊరికి వెళ్లే వారు గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు పోలీసులు సూచించారు.
Shirdi Sai Baba: గురువారం నాడు సాయిబాబాను ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి
తాజావార్తలు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!