PM Modi Photo on LPG Cylinder: నిర్మలా సీతారామన్ ఆదేశించారు.. 24 గంట్లో మోడీ ఫొటో పెట్టారు.. కానీ, ప్లేసే మారింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫోటోల ఫ్లెక్సీల యుద్ధం ఈ నాటిది కాదు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. హోంశాఖ మంత్రి అమిత్షా పర్యటన సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది.. సోషల్ మీడియాలోనూ.. పెద్ద రచ్చే జరిగింది.. అయితే.. ఇప్పుడు.. మరోసారి అలాంటి యుద్ధానికి తెరలేపారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్… శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె.. బీర్కూరు మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు.. అయితే, రేషన్ షాపుల్లో పూర్తిగా ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీని ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్.. ఈ విషయంలో రేషన్ డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి… వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.. అయితే, ఆ రేషన్ షాపు దగ్గర మోడీ ఫొటో కనిపించలేదు.. కానీ, మరో చోట మాత్రం ప్రధాని ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి..
Read Also: Robbery: రూ.6కోట్ల విలువైన నగలు దోచారు… రూ.100 పేటీఎం చేసి దొరికిపోయారు..!
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
వినియోగదారులకు వంట గ్యాస్ పంపిణీ చేసేందుకు ఎల్పీజీ సిలిండర్ల లోడ్తో ఓ ఆటో వెళ్తుంది.. ఆ ఆటో నిండా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి.. ఇక, ఆ సిలిండర్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో అటించి ఉన్నాయి.. ‘మోడీ జీ రూ.1105’ అని రాసిఉన్న ఆ ఫొటోలు ప్రధాని మోడీ గట్టిగా నవ్వుతూ కనిపిస్తున్నారు.. అయితే, దీనిపై వెరైటీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అడిగారు.. 24 గంటలు తిరగక ముందే.. ఇలా ప్రధాని ఫొటోలు పెట్టారంటూ సెటైర్లు వేస్తున్నారు.. మొత్తంగా.. మరోసారి టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ, ఫొటోల వార్ తెరపైకి వచ్చింది. కాగా, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయయని.. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1100 దాటించిన ఘనత మోడీదేనంటూ.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!