Robbery: రూ.6కోట్ల విలువైన నగలు దోచారు… రూ.100 పేటీఎం చేసి దొరికిపోయారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత పెద్ద దొంగలైనా.. కొన్ని సార్లు చిన్న క్లూతో దొరికిపోతుంటారు.. ఇప్పుడు.. ఢిల్లీలోనే అలాంటి ఘటనే జరిగింది… ఏకంగా రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు ఎత్తికెళ్లిన ముఠా.. రూ.100 పేటీఎం చేసి దొరికిపోయింది.. ఆ ఒక్కటే.. ఆ ముఠా గుట్టురట్టు చేసింది.. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం ఇద్దరు వ్యక్తలు పహర్గంజ్లోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వస్తున్నారు.. వీరిలో ఒకరు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు.. కొద్ది దూరం తర్వాత బ్యాగు పట్టుకుని వస్తున్న ఆ ఇద్దరినీ అడ్డుకున్నారు.. వారితో మరో ఇద్దరు కలిసి.. చేతిలో బ్యాగు ఉన్న వ్యక్తుల కళ్లలో కారం కొట్టి.. ఆ బ్యాగ్తో ఉడాయించారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
Read Also: Tammineni Veerabhadram: టీఆర్ఎస్కు మద్దతు రాజకీయ ఎత్తుగడ.. త్వరలో పాదయాత్ర..
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
బాధితుడు సోమ్వీర్ చండీగఢ్లోని ఓ పార్సిల్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. బుధవారం ఉదయం 4.15 గంటల సమయంలో మరో ఉద్యోగి జగదీప్ సైనీతో కలిసి పహర్గంజ్లోని తమ ఆఫీసు నుంచి పార్సిల్ తీసుకుని డీబీజీ రోడ్డు వైపు వెళ్తున్నారు.. అయితే, మిలీనియం హోటల్ వద్దకు వారు చేరుకోగానే.. పోలీసు యూనిఫామ్లో ఉన్న ఓ యువకుడితో పాటు మరో వ్యక్తి వారిని ఆపి.. బ్యాగులు చెక్ చేయాలని అన్నాడు. ఇదే సమయంలో మరో ఇద్దరు వచ్చి.. బాధితుల కళ్లలో కారం కొట్టి బ్యాగులుతో పరారయ్యారు.. అయితే, ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులకు సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడ్డాయి..
వారం రోజుల రోజులకు సంబంధించి ఆ ప్రాంతంలోని 700 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు.. ఇంటెలిజెన్స్ పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించారు.. వారిలో ఒకడు క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతుండగా.. టీ తాగడానికి మరొకడు పేటీఎం నుంచి రూ.100 డ్రైవర్కు ట్రాన్సఫర్ చేసి తీసుకున్నట్టు గుర్తించారు.. దీంతో.. ఆ పేటీఎం లావాదేవీలపై దృష్టిపెట్టిన పోలీసులు.. ఆ దొంగలు నజఫ్గడ్కు చెందినవారిగా గుర్తించారు.. వారంతా రాజస్థాన్కు పారిపోయినట్ నిర్ధారణకు వచ్చారు.. ఓ టీమ్ను అక్కడికి పంపి.. ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.6 కోట్ల విలువైన 6.3 కిలోల బంగారం, మూడు కిలోల వెండి, 106 ముడి వజ్రాలు, ఇతర వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు.. మొత్తంగా వంద రూపాయలు పేటీఎం చేసి దొరికిపోయారు ఈ బంగారం దోపిడీ దొంగలు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..