MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ.బి.సి మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీనర్గాలు, దళితులు, ఆదివాసుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా మోది చేస్తున్న కృషి ఫలితంగానే బాబా సాహెబ్ కలల సాకారం అవుతున్నాయన్నారు. అంబేద్కర్ ఆశయాల సాకారం కొరకు మోది ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను మోడీ ప్రభుత్వం అమలు పరుస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో దళితులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మోది ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో మోడీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. 75 సంవత్సారాల స్వాతంత్ర్య దేశంలో మొదటి సారి ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేసింది మోడీ ప్రభుత్వం అని తెలిపారు.
Read also: 2 Fish Cost 4 Lakh: 2 చేపలకు రూ. 4 లక్షలు.. ఎందుకంత డిమాండ్..?
Also Read
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
గత ప్రభుత్వాలు, గత పాలకులు విస్మరించిన అణచివేసిన వర్గాలను ఎంచుకుని వారికి పెద్ద పీట వేస్తుంది మోడీ ప్రభుత్వమని అన్నారు. అత్యంత పేద వారికి న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా మోడి ప్రభుత్వం భావిస్తోందన్నారు. కేవలం విద్యా ఉద్యోగాలకే కాకుండా పారిశ్రామిక వేతలుగా తయారు చేయడానికి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి పంచ తంత్ర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. కులం, మతం పేరుతో అసమానతలకు గురి కాకుండా మోడీ ప్రభుత్వం పరిపాల చేస్తుందన్నారు. కొంత మంది రాజ్యాంగాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవకాశం వచ్చినప్పుడల్లా దళితులకు మోది ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వస్తుందన్నారు. అంబేద్కర్ నీ రెండు సార్లు కాంగ్రెస్ ఓడించడానికి ప్రయత్నం చేసిందన్నారు. కానీ ఈ రోజు అంబేద్కర్ పేరుతో వారు ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోడీ పరిపాల జరుగుతుందన్నారు.
Fire Accident: నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అగ్ని ప్రమాదం
తాజావార్తలు
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!