MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..
MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ.బి.సి మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీనర్గాలు, దళితులు, ఆదివాసుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా మోది చేస్తున్న కృషి ఫలితంగానే బాబా సాహెబ్ కలల సాకారం అవుతున్నాయన్నారు. అంబేద్కర్ ఆశయాల సాకారం కొరకు మోది ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను మోడీ ప్రభుత్వం అమలు పరుస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో దళితులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మోది ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో మోడీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. 75 సంవత్సారాల స్వాతంత్ర్య దేశంలో మొదటి సారి ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేసింది మోడీ ప్రభుత్వం అని తెలిపారు.
Read also: 2 Fish Cost 4 Lakh: 2 చేపలకు రూ. 4 లక్షలు.. ఎందుకంత డిమాండ్..?
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
గత ప్రభుత్వాలు, గత పాలకులు విస్మరించిన అణచివేసిన వర్గాలను ఎంచుకుని వారికి పెద్ద పీట వేస్తుంది మోడీ ప్రభుత్వమని అన్నారు. అత్యంత పేద వారికి న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా మోడి ప్రభుత్వం భావిస్తోందన్నారు. కేవలం విద్యా ఉద్యోగాలకే కాకుండా పారిశ్రామిక వేతలుగా తయారు చేయడానికి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి పంచ తంత్ర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. కులం, మతం పేరుతో అసమానతలకు గురి కాకుండా మోడీ ప్రభుత్వం పరిపాల చేస్తుందన్నారు. కొంత మంది రాజ్యాంగాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవకాశం వచ్చినప్పుడల్లా దళితులకు మోది ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వస్తుందన్నారు. అంబేద్కర్ నీ రెండు సార్లు కాంగ్రెస్ ఓడించడానికి ప్రయత్నం చేసిందన్నారు. కానీ ఈ రోజు అంబేద్కర్ పేరుతో వారు ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోడీ పరిపాల జరుగుతుందన్నారు.
Fire Accident: నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అగ్ని ప్రమాదం
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!