Kishan Reddy : 95% మంది డాక్టర్ వద్దకు ఎందుకు వెళ్లాల్సి వస్తోందో తెలుసా..?
- మోడీ ప్రభుత్వ ఆరోగ్య ప్రాధాన్యతపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- ఉప్పల్లో జన ఔషధి వేర్హౌజ్ ప్రారంభోత్సవం
- ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు – పేద, మధ్యతరగతికి వరం
- మందుల ధరలు 90% వరకు తగ్గింపు.. జన ఔషధి కేంద్రాల విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వేర్హౌజ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన వారు పెన్షన్ మొత్తాన్ని వైద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని, పేద , మధ్యతరగతి కుటుంబాలు కూడా అనారోగ్యం కలిగితే జీవితాంతం సంపాదించిన మొత్తాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
మోడీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం కింద 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స అందిస్తున్నామని, తెలంగాణలో బస్తీ దవాఖానల్లో వెల్నెస్ సెంటర్లు ప్రారంభించామని చెప్పారు. మందుల ధరలను 50%-90% తక్కువగా అందించే జన ఔషధి కేంద్రాలు ప్రజల వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తున్నాయని వివరించారు.
Also Read
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం భారీ సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం తప్పు అని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దీన్ని సమర్థంగా అమలు చేయాలని కోరారు.
AI replacing Keyboard and Mouse: ఐదేళ్ల తర్వాత మౌస్-కీబోర్డ్ అవసరమే ఉండదట.. మైక్రోసాఫ్ట్ సంచలనం
తాజావార్తలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!