Kishan Reddy : 95% మంది డాక్టర్ వద్దకు ఎందుకు వెళ్లాల్సి వస్తోందో తెలుసా..?
- మోడీ ప్రభుత్వ ఆరోగ్య ప్రాధాన్యతపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- ఉప్పల్లో జన ఔషధి వేర్హౌజ్ ప్రారంభోత్సవం
- ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు – పేద, మధ్యతరగతికి వరం
- మందుల ధరలు 90% వరకు తగ్గింపు.. జన ఔషధి కేంద్రాల విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వేర్హౌజ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన వారు పెన్షన్ మొత్తాన్ని వైద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని, పేద , మధ్యతరగతి కుటుంబాలు కూడా అనారోగ్యం కలిగితే జీవితాంతం సంపాదించిన మొత్తాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
మోడీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం కింద 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స అందిస్తున్నామని, తెలంగాణలో బస్తీ దవాఖానల్లో వెల్నెస్ సెంటర్లు ప్రారంభించామని చెప్పారు. మందుల ధరలను 50%-90% తక్కువగా అందించే జన ఔషధి కేంద్రాలు ప్రజల వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తున్నాయని వివరించారు.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం భారీ సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం తప్పు అని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దీన్ని సమర్థంగా అమలు చేయాలని కోరారు.
AI replacing Keyboard and Mouse: ఐదేళ్ల తర్వాత మౌస్-కీబోర్డ్ అవసరమే ఉండదట.. మైక్రోసాఫ్ట్ సంచలనం
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!