NTV Telugu Site icon

Heart Attack: స్కూల్‌లో ప్రేయర్ చేస్తుండగా గుండెపోటుతో పీఈటీ టీచర్ మృతి

Heart Attack

Heart Attack

Heart Attack: ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని అరబిందో స్కూల్‌లో రాజారెడ్డి పీఈటీగా పని చేస్తున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు హాజరైన రాజారెడ్డి విద్యార్థులతో ఉత్సాహంగా గడిపాడు. పిల్లలందరినీ ప్రేయర్ కోసం పిలిచాడు. తర్వాత ప్రేయర్ మొదలైంది. అయితే, అంతలోపే ఉన్నట్లుండి కార్డియాక్ అరెస్టుతో అదరిముందే కుప్పకూలిపోయాడు.

Read Also: Lightning strike: యూపీలో ఘోరం.. పిడుగుపాటుకు 38 మంది మృతి

వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, యాజమాన్యం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. తమను ఆటలు ఆడిస్తూ ఉత్సాహపరిచే పీఈటీ టీచర్ రాజారెడ్డి మృతి పట్ల పాఠశాల విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజారెడ్డి మృతితో అతడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.