Five AP villages appealed to Governor: ఏపీతో ఇబ్బంది పడుతున్నాం.. తెలంగాణలో కలిపేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Five AP villages appealed to Governor: భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూడెం, గుండాలకు చెందిన గిరిజనులు గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఏపీలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం, ఏపీ చాలా దూరంగా ఉందని.. అందువల్ల తమను తెలంగాణ ప్రాంతం అయిన భద్రాచలంలో కలపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే వీరి సమస్యను విన్న గవర్నర్ ఐదు గ్రామాల ప్రజల పరిసస్థితి విన్నానని.. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం తాను ప్రభుత్వాలతో మాట్లాడతునానని అన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడ చర్చిస్తానని చెప్పారు.
ఆదివాసీలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా.. అభివృద్ధి చేయడంలో అందరం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు గవర్నర్ తమిళిసై.. నా వంతుగా రాజభవన్ నుండి మీ ఆరోగ్య రక్షణకు అంబులెన్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వడం ఆనందంగా ఉందన్న ఆమె.. ఒక డాక్టర్ గా మీ అందరికి ఆరోగ్య పరీక్షలు నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఎవరు బాగుపడాలన్నా,, ఎవరు అభివృద్ధి చెందాలన్నా.. విద్య చాలా అవసరం.. ఆదివాసి పిల్లలకు నేటి వరకు నాణ్యమైన విద్య అందుబాటు లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఆదివాసీలు ఎదగడానికి విద్య పనిచేస్తుందన్న ఆమె.. ఆదివాసీలకు ఆరోగ్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది, సరైన పోషకాహారం అందక వారు బలహీనులుగా మిగిలిపోతున్నారని.. వారికి నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపడతానని హామీనిచ్చారు.. అసమానతలు నిర్మూలించి అందరూ సమానంగా జీవించే విధంగా పనిచేస్తామన్నారు గవర్నర్ తమిళిసై.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ఇక, భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్బంగా గిరిజనులతో మమేకం అయ్యారు. గిరిజనుల యువతులతో కలసి నృత్యం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కర్తవ్యంగా కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడ ఉన్న ఐదు విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని తన దృష్టికి తీసుకొచ్చారు.. వారికి వైద్యం, ఇతరాత్ర సదుపాయాల గురించి తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడ
తీసుకెళ్తానని తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!