Fake Real Estate Company: అంతా నేను చూసుకుంట..ఎంతిస్తవో చెప్పు!
కొంత మంది వ్యక్తులు నయా దందాలకు తెరలేపుతున్నారు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు పోలీసులు , మరికొందరు రవాణా శాఖాధికారులు , ఇంకొందరు విజిలెన్స్ , ఏసీబీ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు గతంలోకూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి దందాలకు పాల్పడిన వారిలో కొందరు జైలు పాలయ్యారు కూడా. కానీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగకుండా దళారుల అవతారమెత్తుతున్నారు.
బెదిరింపులు.. వసూళ్లు
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
పట్టణాలు, నగరాల్లో మరో రకం దళారులు పుట్టుకొచ్చారు. ఎవరైనా ఇల్లు, లేదా అపార్టుమెంట్, లేదా ఇతర నిర్మాణాలు చేసిన సమయంలో.. ముందుగా వారి వద్దకు వెళ్లి.. ‘నీవు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నావు.. నాకు ఏం ఇస్తావో చెప్పు.. లేకుంటే అన్ని విభాగాల అధికారులకు ఫిర్యాదు చేస్తా” అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొంత మంది గొడవెందుకులే.. అనుకొని ఎంతో కొంత సర్దుబాటు చేసి పంపిస్తుండగా, ఇంకొందరు వారి మాటలను తిప్పికొడుతున్నారు. దీంతో.. సదరు వ్యక్తులు ఆకాశరామన్న పేరుతో అధికారులకు లేఖలు రాస్తూ ఫిర్యాదు చేస్తున్నారు.
ఎవరైనా ఒక్క అధికారి వెళ్లినా సరే దానిని ఆధారంగా చేసుకొని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిర్మాణాల విషయంలోనూ అనుమతులు తెస్తామంటూ కొందరు దళారులు మాయమాటలు చెప్పి దోచుకుంటున్నారు. అలాగే, పట్టాభూముల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలు యజమానిని బెదిరించి డబ్బుల వసూళ్లకు దిగుతున్నారు. లేదా ఆక్రమించడం.. క్షేత్రస్థాయిలో గొడవలు చేయడం తద్వారా ఏదో విధంగా కొన్ని డబ్బులు వసూళ్లు చేయడం. నిజానికి సంబంధిత దళారుల్లో నూటికి 95 శాతం మందికి అధికారులెవరూ తెలియదు. కేవలం ఎదుటి వ్యక్తి బలహీనత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆడుతున్న డ్రామాలు. వీటి వల్ల అధికారులు బదనాం అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
పకడ్బందీ చర్యలు
నిజానికి దళారులు, మోసకారుల పని పట్టేందుకు ఒకవైపు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ అనేక చర్యలు చేపడుతున్నారు. ఏ విషయంలోనూ దళారుల మాటలు నమ్మవద్దని చెబుతున్నారు. ఏదైనా అవసరం ఉంటే సంబంధిత అధికారులను కలిసి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలి తప్ప.. మధ్యవర్తులను ఆశ్రయించ వద్దని పదేపదే ప్రకటనలు జారీ చేస్తున్నారు.
దౌర్జన్యంగా భూముల ఆక్రమణలకు పాల్పడినా, లేదా డబ్బుల వసూళ్లకు పాల్పడినా వారిపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుడి కోరిక మేరకు.. అవసరమైతే పేర్లు బయట పెడుతామని, లేదంటే విచారణ చేసి.. సంబంధిత దళారులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీపీ వీ. సత్యనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే..
అలాగే, ప్రభుత్వ పథకాల నుంచి మొదలు ఇతర ఏ అంశాల్లోనూ దళారుల మాటలు నమ్మవద్దని, దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్లు, నిర్మాణాల అనుమతులన్నీ నిబంధనల ప్రకారమే ఉంటాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి వాటి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.
Shocking Survey: ఏపీలో సైకో భర్తలు.. టార్చర్ పెట్టడంలో నెం. 1 అంట అంట
- Tags
- cheated
- Departments
- fraud
- people
- police
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!