Lotus Pond Hyderabad: చేపలు చస్తున్నాయ్.. వాసనకు ముక్కులు పోతున్నాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lotus Pond Hyderabad: వాతావరణ పరిస్థితులలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు కొడుతూనే వానలు కూడా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, ఎండలు వాతావరణ మార్పులతో జనజీవనమే కాదు.. జీవరాసులపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో నీటి మట్టము క్రమేపి తగ్గడం జరుగుతుంది. వేసవి ముగిసే వరకు నీరు క్రొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితులలో నీటిలో వున్న చేపలు మృతి చెందుతున్నాయి. లోటస్పాండ్ చెరువులో చేపల మృతి కలకలం రేపుతుంది. భారీగా చేపలు చనిపోవడంతో ఆప్రాంతమంతా దుర్వాసన రావడం మొదలైంది. దీంతో వాసన భరించలేక వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ లో చేపలు చనిపోతే పట్టించుకునే నాధుడు కరువయ్యాడని మండిపడ్డారు.
Read also: Manhole: మ్యాన్హోల్లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
నీటిని మార్చనందుకే ఇలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ ను అధికారులు గాలికి వదిలేసారని తీవ్ర ఆరోపణలు చేశారు. చేపలు అన్ని చనిపోతున్న, తీవ్ర దుర్వాసన వస్తున్నా అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోకుండా లోటస్ పాండ్ ను వదిలేసారని మండిపడుతున్నారు. వాకర్లు చేస్తున్నప్పడు విపరీతమైన దుర్వాసన వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు లోటస్ పాండ్ ను సందర్శించి చేపలను తొలగించాలని కోరుతున్నారు. అయితే నేపథ్యంలో పీసీబీ అధికారులు రంగంలోకి దిగారు. లోటస్ పాండ్ ను సందర్శించారు. చేపలు ఎందుకు చనిపోయాయి? ఎలా చనిపోయాయని ఆరా తీస్తున్నారు. నీటిని మార్చకపోవడం వల్లే ఇలా జరిగిందా? లేక నీటిలో ఏమైనా విషవాయువు కలిసిందా? అనే విషయమై ఆరా తీస్తున్నారు. చనిపోయిన చేపలను లోటస్ పాండ్ నుంచి తొలగించేందుకు ప్రత్నాలు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇబ్బంది గురుకాకుండా ఉండేందుకు అధికారులపై చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారులు వెల్లడించారు.
Manhole: మ్యాన్హోల్లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!