హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముంబై వయా హైదరాబాద్ మీదుగా జగ్దల్ పూర్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గత మూడు గంటలుగా ఎయిర్పోర్ట్ లో పడి కాపులు కాస్తున్న ప్రయాణీకులు సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఎయిర్పోర్ట్ లో బైఠాయించారు ప్రయాణీకులు.
ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదం కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే మరో విమానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే స్పందించని ఎయిర్లైన్స్ సిబ్బంది తీరుపై నిరసన తెలుపుతున్నారు. ప్రయాణీకులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు ఎయిర్ లైన్స్ సిబ్బంది.