తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఎయిర్లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యం కావడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఆందోళన చేశారు.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముంబై వయా హైదరాబాద్ మీదుగా జగ్దల్ పూర్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గత మూడు గంటలుగా ఎయిర్పోర్ట్ లో పడి కాపులు కాస్తున్న ప్రయాణీకులు సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఎయిర్పోర్ట్ లో బైఠాయించారు ప్రయాణీకులు. ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదం కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా…