Secunderabad: దసరా ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ..
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ..
- దసరా సెలవులతో సొంతూళ్ళ బాట పట్టిన జనాలు..
- ఏపీ- నార్త్ ఇండియా వైపు వెళ్ళే ట్రైన్స్ లో రద్దీ..
- ఇప్పటికే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన రైల్వే శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: దసరా పండుగల నేపథ్యంలో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వృత్తి, ఉపాధి రీత్యా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న పొరుగు ప్రాంతాలకు చెందిన వారు భార్యాపిల్లలతో సహా రైళ్లలో తరలివెళుతుండటంతో ప్లాట్ఫారమ్లన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. నిన్నటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవులు ఇవ్వడంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న రైళ్లలో పలువురు తరలిస్తున్నారు. దీంతో ఏపీ, ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ నెలలో దాదాపు 650 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు పండుగ సీజన్లో, భారతీయ రైల్వే ప్రయాణికుల రద్దీని తీర్చడానికి మొత్తం 6,000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్లు ఉండటం..దీనిని పరిష్కరించడానికి, రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో దాదాపు 170,000 మంది ప్రయాణికులు ప్రతిరోజూ 200 రైళ్లలో సికింద్రాబాద్ నుంచి ప్రయాణిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నప్పటికి ఈ రద్దీకి సరిపోతాయా అనే సందేహం కలుగక మానదు. అయినప్పటికీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Basara Dasara: ముస్తాబైన ‘బాసర’.. నేడు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
తాజావార్తలు
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!