Parliament Elections 2024: కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలను కేంద్రాలకు తరలించి ఓట్లను లెక్కించనున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్లో 14 టేబుళ్లు, నాగర్కర్నూల్ పార్లమెంట్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టనున్నారు.
Read More: Akhanda 2 : అఖండ 2 లో ఆ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్..?
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ ఓట్ల లెక్కింపునకు అధికారులు కొన్ని నివేదికలు రూపొందించారు. అయితే..ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయా జిల్లాల పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో.. కౌంటింగ్ ఏర్పాట్లను మహబూబ్ నగర్ రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. కాగా.. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 31 మంది అభ్యర్థులు, నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Read More: Telangana Lok Sabha Election: 34 కౌంటింగ్ కేంద్రాలు.. 12 టీమ్లతో సెక్యూరిటీ..
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 282 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 21 రౌండ్లు, నారాయణపేటలో 270 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు, మహబూబ్ నగర్ లో 275 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు ఏర్పాటు చేశారు. జడ్చర్లలోని 274 పోలింగ్ కేంద్రాలకు 20 రౌండ్ల 14 టేబుళ్లు, దేవరకద్రలోని 289 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, మక్తల్లోని 284 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, షానగర్లోని 263 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు 19 రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
AP Election Results 2024 Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు 2024 లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?