Parliament Elections 2024: కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలను కేంద్రాలకు తరలించి ఓట్లను లెక్కించనున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్లో 14 టేబుళ్లు, నాగర్కర్నూల్ పార్లమెంట్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టనున్నారు.
Read More: Akhanda 2 : అఖండ 2 లో ఆ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్..?
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ ఓట్ల లెక్కింపునకు అధికారులు కొన్ని నివేదికలు రూపొందించారు. అయితే..ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయా జిల్లాల పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో.. కౌంటింగ్ ఏర్పాట్లను మహబూబ్ నగర్ రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. కాగా.. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 31 మంది అభ్యర్థులు, నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Read More: Telangana Lok Sabha Election: 34 కౌంటింగ్ కేంద్రాలు.. 12 టీమ్లతో సెక్యూరిటీ..
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 282 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 21 రౌండ్లు, నారాయణపేటలో 270 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు, మహబూబ్ నగర్ లో 275 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు ఏర్పాటు చేశారు. జడ్చర్లలోని 274 పోలింగ్ కేంద్రాలకు 20 రౌండ్ల 14 టేబుళ్లు, దేవరకద్రలోని 289 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, మక్తల్లోని 284 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, షానగర్లోని 263 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు 19 రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
AP Election Results 2024 Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు 2024 లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?