Off The Record : తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం పట్టు సాధించిందా..? లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీలో అధికారపక్షం పైచేయి సాధించగలిగిందా? ఇన్నాళ్ళు పట్టు విడుపులతో నడిచిన సభ క్రమంగా ఏకపక్షం అవుతోందా? ఆ విషయమై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎక్కడ విపక్షాన్ని డామినేట్ చేయగలిగింది అధికార పక్షం? మెయిన్ అపోజిషన్ ఎక్కడ కార్నర్ అయింది? అందులో కీలక పాత్ర ఎవరిది? తెలంగాణ అసెంబ్లీలో గడిచిన రెండు రోజులుగా అధికార పక్షం పైచేయి సాధించినట్లు కనపడుతోందంటున్నారు పరిశీలకులు. గత అసెంబ్లీ సమావేశాలకు, ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాల్లో పనితీరుని బేరీజు వేసుకుంటే కొంత పట్టు సాధించినట్లు కనపడుతోందట. రెండు రోజులు అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలుగా వ్యవహారం నడిచింది. సబిత ఇష్యూని అజెండాగా మార్చుకోవాలని డిసైడైంది బీఆర్ఎస్. అందులో భాగంగానే రెండో రోజు కూడా…. ఇష్యుూని రైజ్ చేసింది. ఐతే అదే సమయంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రారంభం నుండి మొదలుకొని…బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడం…మహిళా సభ్యులు పోడియం ముందు నిరసన తెలపడం వంటి వాటినన్నిటినీ లైట్ తీసుకున్న అధికారపక్షం… స్కిల్ యూనివర్సిటీ బిల్లుకి ఆమోద ముద్ర వేయించుకోగలిగింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్నా… అన్ని పక్షాల సభ్యులతో మాట్లాడించింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడంతో….దాన్నో అస్త్రంగా మార్చుకుంది అధికార పార్టీ. సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ, సభలో అందరు సభ్యులతో మాట్లాడించాలని వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసింది సర్కార్. దీంతో సభలో సభ్యులు అదే అంశం మీద మాట్లాడాల్సి వచ్చింది.
బీఆర్ఎస్ సభ్యులకు మైక్ ఇచ్చినా… వారు కూడా కేవలం వర్గీకరణ అంశంపైనే మాట్లాడాలని కట్టడి చేయగలిదింది అధికారపక్షం. సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ పై మాట్లాడే ప్రయత్నం చేసినా.. సభాపతి కూడా సబ్జెక్ట్ నుంచి పక్కకు వెళ్లవద్దంటూ సభను కంట్రోల్ చేశారు. దీంతో… అటు సబిత ఎపిసోడ్లో గులాబీ దళాన్ని కట్టడి చేయడంతో పాటు ఇటు వర్గీకరణపై కూడా వాళ్ళకు వాదన లేకుండా చేయగలిగారన్న టాక్ మొదలైంది. ఈ క్రమంలోనే రెండు రోజులుగా అధికార పక్షం పైచేయి సాధిస్తోందన్న చర్చ మొదలైంది. ఇక సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ లో… డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కౌంటర్ టోటల్ ఎపిసోడ్లో హైలైట్. సబిత వ్యవహారంపై సిఎం రేవంత్ స్పందించిన తర్వాత.. సభ కొంత హీటెక్కింది. ఆ టెంపోని పీక్స్కు తీసుకువెళ్ళారు భట్టి. గతంలో సబిత కాంగ్రెస్ని మోసం చేశారన్న విషయాన్ని సభ సాక్షిగా ఆయన చక్కగా ఎస్టాబ్లిష్ చేయగలిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పార్టీ వర్గాల్లో. ఇక శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఫామ్లోకి వచ్చారని, భట్టి, శ్రీధర్ బాబు కలిసి రెండు రోజులుగా సభను పూర్తిగా అధికారపక్షానికి అనుకూలం చేయగలిగారని, దీన్ని బట్టి చూస్తుంటే… తొలుత కాస్త తొట్రుపడ్డా ప్రభుత్వం పైచేయి సాధించగలిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయ వర్గాల్లో.
Also Read
- Tags
- congress
- ntv
- OTR
- TG Assembly
తాజావార్తలు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!