Doctor M. Narasimha Rao: ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. మహోన్నత పయనం సాగిస్తున్న వైద్యుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. అలాంటి మహోన్నత లక్ష్యంతో తన పయనం కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ ఎం. నరసింహారావు. తమ ప్రత్యేక నైపుణ్యంతో పలు రకాల వ్యాధులను నయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కేవలం చేతి సిరలు, పల్స్ని తనిఖీ చేయడం ద్వారా మానవ శరీరంలో ఉన్న వ్యాధులను గుర్తిస్తున్నారు. ఈ అద్వితీయ, అరుదైన ప్రతిభ డా. ఎం. నరసింహారావు సొంతం. ఈ రకమైన ప్రతిభను చాలా పరిశోధనల తర్వాత ప్రసిద్ధ హకీమ్, వైడ్స్ మాత్రమే ప్రావీణ్యం ఒకప్పుడు ఉండేది. క్రమంగా ఈ తరహా ప్రత్యేక ప్రతిభ అంతరించింది. ఈ రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యాధులను గుర్తించే ఆరోగ్య పరీక్షలు ఖరీదైనవిగా మారుతున్నాయి.
అయితే, చేతి సిరలు, పల్స్ని తనిఖీ చేస్తూ వ్యాధులను గుర్తించగలిగే డాక్టర్లు ఇటీవల కొద్ది మందే ఉన్నారు. అలాంటి అరుదైన ఈ ప్రతిభను నేర్చుకున్న వారిలో ఆయుర్వేద డాక్టర్ ఎం.నర్సింహారావు ఒకరు. హైదరాబాద్కు చెందిన ఈ వైద్యుడు.. బాగ్ అంబర్పేటలో క్లినిక్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు, ఇతర విదేశాల నుండి కూడా అతని క్లినిక్కి చికిత్స తీసుకునేందుకు, హానికరమైన వ్యాధుల నుండి కోలుకోవడానికి వస్తున్నారు. క్యాన్సర్, థైరాయిడ్, మధుమేహం, గుండె వైఫల్యం, క్రానిక్ కిడ్నీ వ్యాధి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈ డాక్టర్ చికిత్స చేస్తారు. డాక్టర్ నర్సింహారావు వేల మంది రోగులకు చికిత్స అందించి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. కొంత మంది రోగులకు చికిత్స సాధ్యం కాదని ఇతర డాక్టర్లు చేతులెత్తేసిన సమయంలో కూడా డాక్టర్ నర్సింహారావు తన అరుదైన చికిత్స ద్వారా ఎంతోమంది రోగులు కోలుకునేలా చేశారు. డాక్టర్ నర్సింహారావు తన తండ్రి నుండి ఈ అద్వితీయ ప్రతిభను అభ్యసించారు, ప్రావీణ్యం సంపాదించారు. అతని తండ్రి డాక్టర్ ఎం. రమణారావు నాడి, సిరను తాకడం ద్వారా వ్యాధిని తెలుసుకునే ఈ ప్రత్యేక చికిత్స విధానానికి ప్రసిద్ధి చెందారు. డా. నర్సింహారావు తన చిన్నతనం నుండి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పల్స్, సిరలను తాకి వ్యాధులను గుర్తించే ప్రతిభను నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను B.A.M.S, MD (Y&N) లో డిగ్రీ కూడా పొందాడు. అతని అత్యుత్తమ సేవలకు అసోసియేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్రొఫెషనల్స్ ఆఫ్ నార్త్ అమెరికా, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమీషన్ (ECOSOC, యునైటెడ్ నేషన్స్), భారత్ గౌరవ్ శ్రీ సమ్మాన్ పరిషత్ (నీతి అయోగ్, భారత ప్రభుత్వం) వంటి అనేక సంస్థలు గుర్తించి, అవార్డులు అందించారు. డా. నర్సింహారావు మెడిసిన్స్లో చాలా పరిశోధనలు చేశారు. దీని వల్ల రోగులు వారి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ప్రిస్క్రిప్షన్ పొందుతున్నారు. సంపూర్ణంగా కోలుకుంటున్నారు. అతను వారంలో 5 రోజులు (ఆదివారం, గురువారం మినహా) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తన క్లినిక్లో అందుబాటులో ఉంటారు.
Also Read
తండ్రి అడుగు జాడల్లో..
హైదరాబాద్లోని బాగ్ అంబర్పేట్లో ఉన్న శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద క్లినిక్ని నాలుగు దశాబ్దాల క్రితం తన తండ్రి డాక్టర్ ఎం. రమణారావు స్థాపించారు. అతను ఆయుర్వేదంలో గొప్ప పండితుడు. అతను వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడిన కొన్ని మిలియన్ల మంది రోగులకు చికిత్స చేశారు. అతను పల్స్ రీడింగ్లో నిపుణుడు. వైద్య నివేదికల సహాయం లేకుండా ఆరోగ్య సమస్యలను ఖచ్చితంగా నిర్ధారించారు. అతని చికిత్స ఆరోగ్య సమస్యలు ఏమైనప్పటికీ దాదాపు అన్ని రకాల వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా మార్చారు. ఎంతో మంది పేద ప్రజలకు తన సేవలను అందించిన డాక్టర్ ఎం. రమణారావు 2013లో కన్నుమూశారు. డాక్టర్ ఎం. రమణారావు దగ్గర వివిధ వ్యాధులను, వాటి దశలను గుర్తించే పద్ధతిని, పల్స్ రీడింగ్ టెక్నిక్ని నేర్చుకున్నారు ఆయన తనయుడు డా. నర్సింహారావు. తన తండ్రి దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఈ టెక్నిక్ డాక్టర్ నరసింహారావుకు వ్యాధులను సులభంగా గుర్తించడంలో సహాయపడింది. ఎంతో నైపుణ్యం సాధించిన ఈ డాక్టర్.. తన సానుకూల మాటలు, ఆయన స్పందించే విధానం రోగులకు కోలుకోవాలనే ఆశను కలిగిస్తాయి. అల్లోపతి వైద్యులు తిరస్కరించిన అనేక కేసులకు డాక్టర్ నరసింహారావు విజయవంతంగా చికిత్స చేశారు. ఉదాహరణకు గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, కోవిడ్-19, హెచ్ఐవి, హెపటైటిస్-బి మొదలైన వ్యాధులకు అరుదైన మూలికా సమ్మేళనాలను వ్యాధుల దశలు, స్థితిని బట్టి అందిస్తారు. దాంతో రోగులు త్వరగా కోలుకుంటున్నారు. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుండి అనేక మంది రోగులు డాక్టర్. ఎం.నరసింహారావు క్లినిక్లో చికిత్స పొందుతున్నారు. వార్తా పత్రికలు, ఛానల్లు కూడా డాక్టర్ ఎం.నరసింహారావు అద్భుత వైద్య విధానంపై పలు వార్తా కథనాలు రాస్తున్నాయి.
ఎంతో మందిని కాపాడిన కోవిడ్ మెడిసిన్
2020 కరోనా కఠోర సమయంలో డాక్టర్ నరసింహారావు ప్రత్యేక పరిశోధనలు చేసి మూలిక వైద్యాన్ని కనిపెట్టారు. కోవిడ్ వైరస్ను నిర్మూలించే మూలికల మెడిసిన్ను అభివృద్ధి చేశారు. ఈ మెడిసన్ తీసుకున్న కోవిడ్ రోగులు ఆక్సిజన్ వెంటిలేటర్ నుంచి బయటపడ్డారు. మూలికా సూత్రాల ఆవిష్కరణ వల్ల డాక్టర్ ఎం.నరసింహారావుకు ఎన్నో అవార్డులు, సత్కరాలు, గౌరవ డాక్టరేట్లు అందివచ్చాయి.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?