PCC Chief Mahesh Goud: నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మాది రైతు ప్రభుత్వం.. అందుకే నిజామాబాద్ లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించటమే రైతు మహోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఇక, నిజాం సాగర్, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల పూడికను తీయటానికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్ రైతుల వ్యతిరేక పార్టీ.. బీఆర్ఎస్ రైతులను నట్టేటా ముంచింది అని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: అమిత్షాతో చంద్రబాబు కీలక చర్చలు..
అయితే, నిజామాబాద్ జిల్లాలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తెలిపారు. 10 ఏళ్ళల్లో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కేటీఆర్, కేసీఆర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇక, బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
