Nizamabad: ఛీ.. ఇంత నీచులు కూడా ఉన్నారా?.. మతి స్థితిమితం లేని మహిళపై అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: ఛీ..ఛీ.. సమాజం ఎటు పోతోంది.. అని అనిపిస్తుంటుంది. చాలా మందిలో నేర ప్రవర్తనతో పాటూ పైశాసికత్వం రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఛీ నీఛుల్లారా కామ పిశాచాల్లా తయారేంటి అనిపిస్తుంటుంది. అలాంటి కామాంధులకు మహిళ అయి ఉండాలి కానీ బాలికనా, తల్లి, చెల్లి కూడా చూడటంలేదు.. కన్న ప్రేమకే కత్తితో పొడిచి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు పై కూడా అత్యాచారం చేసేందుకు కూడా వెనుకడాటం లేదు. అయితే ఓ ఘటన మనిషి పైశాచిక కామానికి నిదర్శనంగా నిలిచింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కానీ మతిస్థిమితంలేదు. తన లోకంలో తనే మట్లాడుతూ తను ఏం చేస్తుందో తెలియని లోకంలో బతుకుతుంది. అలాంటి మతిస్థిమితం లేని ఓ మహిళపై బీహార్ కు చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. మతి స్థిమితం లేదని తెలిసి కూడా కామంతో ఆమెపై తన కామవాంఛను తీర్చుకున్నాడు. అయితే ఈ ఘటనను చూసిన ఇద్దరు కొడుకులు ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Bro: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ అయ్యిందా…
Also Read
నిజామాబాద్ పట్టణంలోని శ్మశాన వాటికలో నాగుల దశరథ్ (27), మల్లేష్ (21) కూలీలుగా పనిచేస్తున్నారు. ఇద్దరు సోదరులు మతిస్థిమితం లేని తల్లితో కలిసి గుర్బాబడి ప్రాంతంలో నివసిస్తున్నారు. బీహార్కు చెందిన అరుణ్ అనే వలస కూలీ వారి ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు. ఇతను మతిస్థిమితం లేని తల్లిపై కన్నేశాడు. గత శుక్రవారం రాత్రి సోదరులు దశరథ్, మల్లేష్ సినిమాకి వెళ్లగా ఇంట్లో తల్లి ఒంటరిగా ఉంది. ఇది గమనించిన అరుణ్ ఇంట్లోకి చొరబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నతమ్ములు తల్లి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. అదే సమయంలో బయటకు వెళ్లిన ఆమె ఇద్దరు కుమారులు ఇంటికి వచ్చి గమనించారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తల్లిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ వ్యక్తిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గాయాలతో పడి ఉన్న అరుణ్ని గమనించిన ఆటో డ్రైవర్ 108 అంబులెన్స్కు సమాచారం అందించాడు. తీవ్రగాయాలతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న హమాలీ కూలి ఆదివారం మృతి చెందింది. దీంతో పోలీసులు సోదరులు మల్లేష్, దశరథ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతుడు బీహార్లోని సహర్సా జిల్లా మక్కరి ప్రాంతానికి చెందిన అరుణ్గా పోలీసులు గుర్తించారు. అతడి హత్యపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బీహార్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Bro: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ అయ్యిందా…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!