Municipal Elections : ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీకి కాసుల వర్షం..!
- నో డ్యూ సర్టిఫికెట్తో బకాయిల వసూలు వేగం
- రెండు రోజుల్లో రూ.25 లక్షల పన్నుల క్లియరెన్స్
- ప్రతిపాదకుల బకాయిలే అభ్యర్థులకు కొత్త చిక్కులు
- నామినేషన్ గడువు పెంచాలంటూ డిమాండ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు లేవని తెలిపే ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను, కుళాయి పన్ను బకాయిలు ఇప్పుడు వసూలవుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులు సుమారు 25 లక్షల రూపాయల మేర పాత బకాయిలను చెల్లించడం విశేషం. పన్నులు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో, అభ్యర్థులు పోటీపడి మరీ బకాయిలు క్లియర్ చేస్తున్నారు.
Techie Jobs At Risk: హై రిస్క్లో ఐటీ ఉద్యోగాలు.. హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..
Also Read
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
- CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్కు సవాల్.!
ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులకు ఈసారి నిబంధనలు ప్రాణసంకటంగా మారాయి. పోటీ చేసే అభ్యర్థితో పాటు, వారిని ప్రతిపాదించే వ్యక్తులు కూడా ఎలాంటి పన్ను బకాయిలు ఉండకూడదనే నిబంధనపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదించే వ్యక్తికి పన్ను బకాయిలు ఉంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో, అభ్యర్థులు వారి పన్నులు కూడా తామే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇది ఎన్నికల గైడ్లైన్స్లో లేకపోయినా, రిటర్నింగ్ అధికారులు సొంత నిర్ణయాలతో తమను ఇబ్బంది పెడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ముగియడానికి సమయం చాలా తక్కువగా ఉండటం, మరోవైపు సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేదా పని ఒత్తిడి వల్ల గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, దీనివల్ల నామినేషన్ వేయడం కష్టమవుతుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువును మరో రెండు రోజులు పెంచాలని చాలా మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్ను కోరుతున్నారు. నిజామాబాద్లోని 60 డివిజన్లలో సుమారు 400 మంది వరకు అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉండటంతో, ఈ గందరగోళం మరింత పెరిగేలా కనిపిస్తోంది.
Golden Duck: టీ20 మ్యాచ్లో ఫస్ట్ బాల్ కే ఔటైన 5 మంది భారత బ్యాట్స్మెన్స్ వీరే..!
తాజావార్తలు
-
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
-
Gen Z Lifestyle: ‘జెన్ జీ’ లైఫ్స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
-
Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
-
Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
-
Krishna River: కృష్ణానదిలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!