Nizamabad CI Arrest: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. నిజామాబాద్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad CI Arrest: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిని నిర్దోషిగా విడుదల చేసిన కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిజామాబాద్ సీఐని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నిజామాబాద్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్ వాహే ఉన్నారు. నిందితుడు సాహిల్ తప్పించుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్కు పారిపోయిన ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన ప్రేమ్ కుమార్ ఇటీవల నిజామాబాద్ కు బదిలీపై వచ్చారు. విధుల్లో చేరాల్సిన ప్రేమ్కుమార్ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 23వ తేదీ అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద బీహెచ్డబ్ల్యూ కారును అతి వేగంతో నడుపుతూ ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు.
Read also: Tummala: సత్తుపల్లిలో ఫుడ్ ఫార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడిని విడుదల చేశారు. ప్రమాదానికి మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ కారణమని పంజాగుట్టలో కేసు నమోదైంది. నిజామాబాద్ సీఐ పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావుతో ఫోన్ లో మాట్లాడి కేసు తారుమారు చేసేందుకు సహకరించినట్లు విచారణలో తేలింది. స్టేషన్ నుంచి సాహిల్ను విడిపించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుల సెల్ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్తో పాటు మరో ఇద్దరితో షకీల్ మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో జోక్యం చేసుకున్నారనే అనుమానంతో ప్రేమ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన సాహిల్ను ముంబైకి పంపడంలో షకీల్ అనుచరుడు అబ్దుల్వాహే ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితులను విడిచిపెట్టిన ఇన్ స్పెక్టర్ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అసలు నిందితుడిపై కాకుండా మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Bandi sanjay: కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!