Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- గిరిజనుల అభివృద్ధే బీజేపీ లక్ష్యం: నితిన్ నబీన్
- తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటోంది కాంగ్రెస్
- పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించింది బీజేపీ
- కేంద్ర పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం (ATM) లాగా వాడుకుంటోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆ పార్టీ నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో జరిగిన గిరిజన నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చారిత్రాత్మక వరంగల్ మట్టిలో నాటి సమ్మక్క-సారలమ్మల వీరత్వపు స్ఫూర్తి ఇప్పటికీ ఇక్కడి గిరిజన మహిళల్లో స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు.
గిరిజనుల సమగ్ర అభివృద్ధే బీజేపీ లక్ష్యం
గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న చోట్ల ఇప్పటికీ భూములకు సంబంధించిన ల్యాండ్ సర్వేలు జరగలేదని, ఉగ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల్లో ఇంతకాలం గిరిజనుల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని నితిన్ నబీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గిరిజనుల సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. గత యూపీఏ (UPA) కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే.. నేడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏకంగా రూ. 15 వేల కోట్లను గిరిజనుల సంక్షేమం, ప్రగతి కోసం ఖర్చు చేస్తోందని లెక్కలతో సహా వివరించారు.
Also Read
ఎలాంటి లాభం ఆశించకుండానే తెలంగాణకు బీజేపీ మద్దతు
నాడు ఎలాంటి రాజకీయ లాభాలు, స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని నితిన్ నబీన్ గుర్తుచేశారు. ఆనాడు బీజేపీ అగ్రనేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో చిన్నమ్మగా మారి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానో కొట్లాడారని స్మరించుకున్నారు. రాహుల్ గాంధీ ఒక పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, కానీ బీజేపీలోని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ప్రజా సేవ కోసం అంకితమైన ఫుల్ టైమ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ మాటను పూర్తిగా మరిచిపోయి నిరుద్యోగులను వంచించిందని మండిపడ్డారు.
పీవీని కాంగ్రెస్ అవమానిస్తే.. బీజేపీ భారతరత్నతో గౌరవించింది
దేశానికి ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విస్మరించిందని నితిన్ నబీన్ ఆరోపించారు. పీవీ మరణించిన సమయంలో ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా అవమానించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించి అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఇచ్చి సముచితంగా గౌరవించిందని గుర్తుచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని, చేస్తున్న ప్రతి మంచి పనిని బూత్ కమిటీ కార్యకర్తలు బాధ్యతగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పేలా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!