NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- నిమ్స్లో కిడ్నీ రాకెట్ లేదన్న డైరెక్టర్ బీరప్ప
- అవుట్సోర్సింగ్ ఉద్యోగి మోసంతో మొదలైన వివాదం
- డబ్బులు తీసుకున్న ఉద్యోగిపై వేటు.. పోలీసుల విచారణ
- తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIMS : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా సాగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేలాది మంది, ఏటా లక్షలాది మంది పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిమ్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే బురదజల్లుతున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ వివాదానికి గల అసలు కారణాన్ని డాక్టర్ బీరప్ప మీడియాకు వివరించారు. నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఒక రోగికి కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానని నమ్మించి వ్యక్తిగతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యానికి రాతపూర్వక ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, ప్రాథమిక విచారణ జరిపి సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించిందని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
కేవలం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి వ్యక్తిగతంగా చేసిన మోసాన్ని, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని చిలువలు పలువలు చేసి ‘నిమ్స్లో కిడ్నీ రాకెట్’ అంటూ ఒక పెద్ద దందాలాగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఇమేజ్ను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్న వారి అంశాన్ని కూడా ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘటనలో ఇంకెవరి పాత్ర అయినా ఉన్నట్లు విచారణలో తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమాజంలో నిమ్స్ ఆసుపత్రిపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయడానికే కొందరు ఇలాంటి అపోహలను సృష్టిస్తున్నారని, కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇటువంటి దురుద్దేశపూర్వక ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉంటూ వాస్తవాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని డాక్టర్ బీరప్ప కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!