NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- నిమ్స్లో కిడ్నీ రాకెట్ లేదన్న డైరెక్టర్ బీరప్ప
- అవుట్సోర్సింగ్ ఉద్యోగి మోసంతో మొదలైన వివాదం
- డబ్బులు తీసుకున్న ఉద్యోగిపై వేటు.. పోలీసుల విచారణ
- తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIMS : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా సాగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేలాది మంది, ఏటా లక్షలాది మంది పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిమ్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే బురదజల్లుతున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ వివాదానికి గల అసలు కారణాన్ని డాక్టర్ బీరప్ప మీడియాకు వివరించారు. నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఒక రోగికి కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానని నమ్మించి వ్యక్తిగతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యానికి రాతపూర్వక ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, ప్రాథమిక విచారణ జరిపి సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించిందని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు.
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
కేవలం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి వ్యక్తిగతంగా చేసిన మోసాన్ని, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని చిలువలు పలువలు చేసి ‘నిమ్స్లో కిడ్నీ రాకెట్’ అంటూ ఒక పెద్ద దందాలాగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఇమేజ్ను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్న వారి అంశాన్ని కూడా ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘటనలో ఇంకెవరి పాత్ర అయినా ఉన్నట్లు విచారణలో తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమాజంలో నిమ్స్ ఆసుపత్రిపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయడానికే కొందరు ఇలాంటి అపోహలను సృష్టిస్తున్నారని, కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇటువంటి దురుద్దేశపూర్వక ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉంటూ వాస్తవాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని డాక్టర్ బీరప్ప కోరారు.
తాజావార్తలు
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!