Damodara Raja Narasimha : నిమ్స్లో వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
- నిమ్స్లో వైద్య సేవల సమీక్ష చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
- జనవరి నుంచి జులై వరకు 5.44 లక్షల మందికి చికిత్స
- ప్రైవేటు హాస్పిటల్స్ నిర్లక్ష్యం పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- అత్యవసర పేషెంట్లకు సమన్వయంతో మెరుగైన సేవలు అందించాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : నిమ్స్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ, ఈ ఏడాది తొలి 7 నెలల్లో (జనవరి–జులై) 5.44 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించామని తెలిపారు. వీరిలో సగానికి పైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందారని వివరించారు. నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నందున నిమ్స్ను ఆశ్రయించే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అదేవిధంగా, ఈ ఏడాది ఇప్పటివరకు వందకు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిపామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్స్ డైరెక్టర్, వైద్యులు, సిబ్బందిని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్కు వచ్చే రోగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత త్వరగా అడ్మిట్ చేసి, అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం సంబంధిత వార్డుకు షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. డైరెక్టర్ బీరప్ప వివరించిన ప్రకారం, ప్రస్తుతం నిమ్స్ ఎమర్జెన్సీకి రోజూ 80 నుంచి 100 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సగం మందికి పైగా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్లో చికిత్స తీసుకొని, పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో నిమ్స్కు వస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ఆపరేషన్లు చేసి, పేషెంట్లు పూర్తిగా కోలుకోక ముందే డిశ్చార్జ్ చేసి, నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ హాస్పిటల్స్కు పంపిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు నిమ్స్పై భారం పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ఈ నేపథ్యంలో మంత్రి రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి వచ్చే పేషెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, అయితే ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే వారిని కూడా సానుభూతితో చూసి చికిత్స అందించాలని సూచించారు. పేషెంట్లను సగం చికిత్సలోనే డిశ్చార్జ్ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ హాస్పిటళ్ల మధ్య సమన్వయం ఉండాలని, ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్లు నిండినపుడు పేషెంట్లను మరో ప్రభుత్వ హాస్పిటల్కు రిఫర్ చేసి అడ్మిట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పేషెంట్ను రిఫర్ చేసే ముందు ప్రాథమిక చికిత్స చేసి, అవసరమైతే అంబులెన్స్లో డాక్టర్తో పంపించాలని సూచించారు. డ్యూటీ డాక్టర్లు, ఆర్ఎంవోలు పేషెంట్ల అడ్మిషన్, రిఫరల్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Hyderabad Drugs: డ్రగ్స్ కావాలా నాయనా.. వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో ఒక్క మెసేజ్ చాలు!
తాజావార్తలు
-
Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
-
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
-
DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!