విద్యా విధానంపై తెలంగాణలో కొత్త చట్టం..!
తెలంగాణలో విద్యా విధానంపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ మరియు వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు..
Read Also: ఏపీ కరోనా అప్డేట్
కేబినెట్ సబ్ కమిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్లు సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు మంత్రి సబతి ఇంద్రారెడ్డి.
తాజావార్తలు
-
టాలీవుడ్లో సీఐడీ కలకలం… పాపులర్ ప్రొడ్యూసర్ పరార్?
-
Silver Rates: వామ్మో.. సిల్వర్ మళ్లీ షాకిస్తోంది.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
-
Crude Oil and Gas Prices Drop: గుడ్న్యూస్.. దిగివస్తున్న చమురు ధరలు.. తగ్గుతున్న గ్యాస్ రేట్లు!
-
Donald Trump: ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..
-
Tragedy : బేగంపేట్లో విషాదం.. పూజ చేస్తుండగా అగ్నికి ఆహుతైన రిటైర్డ్ ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?