Collector Nikhil: విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. నలుగురు కార్యదర్శులు సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించిన వారిపై వికారాబాద్ కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడమే కాకుండా మండల పంచాయతీ అధికారిపై బదిలీ చేశారు ఆమె. పల్లెప్రగతి పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. పల్లె ప్రగతి పనుల్లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో నిర్లక్ష్యం వహించిన పూడూరు మండలం, చింతల్పల్లి పంచాయతీ కార్యదర్శి హమీద్, గొంగుపల్లి పంచాయతీ కార్యదర్శి శృతిలతో పాటు పరిగి మండలం, మాదారం పంచాయతీ కార్యదర్శి పి.వరలక్ష్మి, వికారాబాద్ మండలం, మదన్పల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిలను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
అంతే కాకుండా పూడూరు ఎంపీవో కరీంను కులకచర్ల మండలానికి బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న ఎంపీవో సురేందర్ను పూడూరుకు బదిలీ చేశారు. డీపీఆర్సీలో పల్లె ప్రగతి కార్యక్రమంపై మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పల్లె ప్రగతి పనులు పరిశీలించేందుకు శనివారం వచ్చిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ డాక్టర్ శరత్ పర్యటనలో వెలుగు చూసిన అంశాలపై సమీక్షించారు. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Also Read
గ్రామాల్లో మురుగు కాలువలు రోజూ శుభ్రం చేయాలని, రోడ్లు, వీధులపై చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామానికి వెళ్లే రోడ్లకు ఇరువైపులా గుంతలు తీసి మొక్కలు నాటాలని, వైకుంఠధామాలకు కరెంట్, నీటి సరఫరా కల్పించాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండిపోకుండా దట్టమైన అడవిని తలపించేలా పచ్చదనం పెంపొందించాలని సూచించారు. ఇళ్లలో నుంచి సేకరించిన తడి చెత్తను ఎరువుగా మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయనేది తెలుసుకునేందుకు నిఘా బృందాలతో తనిఖీ చేయిస్తామని ఆమె తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ కూడా అపరిశుభ్రత కనిపించకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ నిఖిల హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!