IED Blasts : మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టలు..!
- కూంబింగ్ ఆపరేషన్ సమయంలో ఐఈడీ పేలుళ్లు
- 10 మంది జవాన్లకు గాయాలు
- హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలింపు
- అటవీ ప్రాంతం భద్రతా బలగాల ఆధీనంలో
- ఇంకా నాలుగు ఐఈడీ బాంబులు నిర్వీర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ , తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (IED) బాంబులు ఒక్కసారిగా పేలడంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు చెందిన 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.
కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వారు పెద్ద ఎత్తున సమావేశం అయ్యే అవకాశం ఉందని భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సిఆర్పిఎఫ్ (CRPF) , డిఆర్జి (DRG) బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్న సమయంలో, నేల అడుగున మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలాయి. ఈ ఆకస్మిక దాడితో జవాన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Also Read
- CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
- OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
- OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
- KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
Char Dham : చార్ధామ్ యాత్రలో సంచలనం.. అన్యమతస్థులకు నో ఎంట్రీ.?
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో కోబ్రా బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రుద్రేష్ సింగ్ సహా మరికొందరు డిఆర్జి జవాన్లు ఉన్నారు. కొందరికి కాళ్లు , కంటికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను వెంటనే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించి, అక్కడి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్లకు ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, మరో నాలుగు ఐఈడీ బాంబులను బలగాలు గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. మావోయిస్టుల ఏరివేత కోసం ఈ ప్రాంతంలో ఇప్పటికే భారీ సిఆర్పిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల కుట్రలను భగ్నం చేసేందుకు సరిహద్దుల్లో నిఘాను మరింత ముమ్మరం చేశారు.
Vishwak Sen: మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్గా తీసుకున్నా: హీరో విశ్వక్సేన్
తాజావార్తలు
-
SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
-
BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
-
Kanaka Durga Temple: నేడు హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మకు బంగారు బోనం.. వీఐపీ దర్శనాలు నిలిపివేత!
-
Namo Namo Ji Shankara: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శివయ్య పాట.. 8 ఏళ్లైనా అదే జోష్.. 50 కోట్ల వ్యూస్తో రికార్డు!
-
Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!