IED Blasts : మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టలు..!
- కూంబింగ్ ఆపరేషన్ సమయంలో ఐఈడీ పేలుళ్లు
- 10 మంది జవాన్లకు గాయాలు
- హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలింపు
- అటవీ ప్రాంతం భద్రతా బలగాల ఆధీనంలో
- ఇంకా నాలుగు ఐఈడీ బాంబులు నిర్వీర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ , తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (IED) బాంబులు ఒక్కసారిగా పేలడంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు చెందిన 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.
కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వారు పెద్ద ఎత్తున సమావేశం అయ్యే అవకాశం ఉందని భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సిఆర్పిఎఫ్ (CRPF) , డిఆర్జి (DRG) బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్న సమయంలో, నేల అడుగున మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలాయి. ఈ ఆకస్మిక దాడితో జవాన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Also Read
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- OTR : నాంపల్లిలో SIR జరగాల్సిందేనంటున్న ఫిరోజ్ ఖాన్
Char Dham : చార్ధామ్ యాత్రలో సంచలనం.. అన్యమతస్థులకు నో ఎంట్రీ.?
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో కోబ్రా బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రుద్రేష్ సింగ్ సహా మరికొందరు డిఆర్జి జవాన్లు ఉన్నారు. కొందరికి కాళ్లు , కంటికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను వెంటనే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించి, అక్కడి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్లకు ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, మరో నాలుగు ఐఈడీ బాంబులను బలగాలు గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. మావోయిస్టుల ఏరివేత కోసం ఈ ప్రాంతంలో ఇప్పటికే భారీ సిఆర్పిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల కుట్రలను భగ్నం చేసేందుకు సరిహద్దుల్లో నిఘాను మరింత ముమ్మరం చేశారు.
Vishwak Sen: మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్గా తీసుకున్నా: హీరో విశ్వక్సేన్
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..