Shocking Incident : నాంపల్లిలో కలకలం.. పాడుబడ్డ ఇంట్లో వెలుగు చూసిన అస్థిపంజరం
- నాంపల్లి పాడుబడ్డ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి
- వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టిన యువకుడు
- అస్థిపంజరం ఎవరిది? వేగంగా పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఏళ్లుగా పాడుబడి నిలిచిన ఓ ఖాళీ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి రావడంతో ఆ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది.
ఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో, ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ రికార్డ్ చేశాడు. ఆ వీడియో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్గా మారి, కాస్తా వైరల్ అయ్యింది. వైరల్ వీడియోపై స్పందించిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి విచారణ ప్రారంభించారు.
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
అసలు విషయాన్ని పోలీసులు వెలికితీయగా.. యువకుడు ఒక క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడడంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపాడు. ఇంట్లోకి వెళ్లినప్పుడు ఓ మూలన ఉన్న అస్థిపంజరం కనిపించడంతో అది నిజమా కాదా అనేదానిపై స్పష్టత కోసం మర్నాడు మళ్లీ అక్కడికి వెళ్లి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశానని యువకుడు తెలిపాడు.
ఈ సమాచారం ఆధారంగా ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్టీమ్ చేరుకుని అస్థిపంజరాన్ని పరిశీలించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం, ఆ ఇంట్లో గత ఏడు సంవత్సరాలుగా ఎవరూ నివసించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? బయటపడాలంటే డైట్లో ఇవి ఉండాల్సిందే..!
అయితే, అస్థిపంజరం ఎవరికి చెందింది? అది మగవాడిదా? మృతుడి గుర్తింపు ఎలా జరగబోతుంది? మరణానికి కారణం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు ఈ దశలో సమాధానం లేదు. పూర్తి సమాచారం కోసం పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు తరలించారు.
ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పాడుబడి ఉన్న ఇల్లు ఎవరిది? ఆ వ్యక్తి ఎలా మరణించాడు? ఆయన్ను ఎవరైనా హత్య చేశారా లేక సహజ మృతి చెందాడా? అన్న విషయాలపై క్లారిటీ వచ్చే వరకు ఇది తీవ్ర సంచలనంగా మారే అవకాశముంది.
ప్రస్తుతం, పోలీసుల దృష్టి వీడియో తీసిన యువకుడి వివరాలపై మాత్రమే కాదు, అస్థిపంజరం తాలూకు ఆధారాలపై మరింత దృష్టి పెట్టారు. అతి త్వరలోనే పూర్తి విచారణ నివేదిక వెలువడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!