Shocking Incident : నాంపల్లిలో కలకలం.. పాడుబడ్డ ఇంట్లో వెలుగు చూసిన అస్థిపంజరం
- నాంపల్లి పాడుబడ్డ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి
- వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టిన యువకుడు
- అస్థిపంజరం ఎవరిది? వేగంగా పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఏళ్లుగా పాడుబడి నిలిచిన ఓ ఖాళీ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి రావడంతో ఆ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది.
ఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో, ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ రికార్డ్ చేశాడు. ఆ వీడియో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్గా మారి, కాస్తా వైరల్ అయ్యింది. వైరల్ వీడియోపై స్పందించిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి విచారణ ప్రారంభించారు.
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
అసలు విషయాన్ని పోలీసులు వెలికితీయగా.. యువకుడు ఒక క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడడంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపాడు. ఇంట్లోకి వెళ్లినప్పుడు ఓ మూలన ఉన్న అస్థిపంజరం కనిపించడంతో అది నిజమా కాదా అనేదానిపై స్పష్టత కోసం మర్నాడు మళ్లీ అక్కడికి వెళ్లి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశానని యువకుడు తెలిపాడు.
ఈ సమాచారం ఆధారంగా ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్టీమ్ చేరుకుని అస్థిపంజరాన్ని పరిశీలించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం, ఆ ఇంట్లో గత ఏడు సంవత్సరాలుగా ఎవరూ నివసించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? బయటపడాలంటే డైట్లో ఇవి ఉండాల్సిందే..!
అయితే, అస్థిపంజరం ఎవరికి చెందింది? అది మగవాడిదా? మృతుడి గుర్తింపు ఎలా జరగబోతుంది? మరణానికి కారణం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు ఈ దశలో సమాధానం లేదు. పూర్తి సమాచారం కోసం పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు తరలించారు.
ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పాడుబడి ఉన్న ఇల్లు ఎవరిది? ఆ వ్యక్తి ఎలా మరణించాడు? ఆయన్ను ఎవరైనా హత్య చేశారా లేక సహజ మృతి చెందాడా? అన్న విషయాలపై క్లారిటీ వచ్చే వరకు ఇది తీవ్ర సంచలనంగా మారే అవకాశముంది.
ప్రస్తుతం, పోలీసుల దృష్టి వీడియో తీసిన యువకుడి వివరాలపై మాత్రమే కాదు, అస్థిపంజరం తాలూకు ఆధారాలపై మరింత దృష్టి పెట్టారు. అతి త్వరలోనే పూర్తి విచారణ నివేదిక వెలువడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!