Nampally Fire Accident : అగ్నికీలల్లో ఆరుగురు.. కొనసాగుతున్న రెస్క్యూ.. ఇవాళ ఎగ్జిబిషన్కు రావొద్దన్న పోలీసులు
- నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
- మంటల్లో చిక్కుకున్న ఆరుగురు
- దట్టమైన పొగతో రెస్క్యూ కష్టాలు
- నాలుగు గంటలుగా ఆపరేషన్ కొనసాగింపు
- నాంపల్లి – అబిడ్స్ – MJ మార్కెట్లో భారీగా ట్రాఫిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని నాంపల్లిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. నాంపల్లిలోని ‘బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్’ గోదాంలో మంటలు చెలరేగి దాదాపు నాలుగు గంటలు గడుస్తున్నా, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్నీచర్ గోదాంలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో, అదే భవనంలో నివసిస్తున్న మూడు కుటుంబాలు అగ్నికీలల మధ్య చిక్కుకుపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం మొత్తం ఆరుగురు లోపల ఉన్నట్లు గుర్తించారు. వీరిలో వాచ్మెన్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అఖిల్ (7), ప్రణీత్ (11) తో పాటు, మరో కుటుంబానికి చెందిన నలుగురు పెద్దవారు ఉన్నారు. దట్టమైన పొగలు , మంటల కారణంగా లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సుమారు నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా సాగుతోంది.
CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ప్రధాన రహదారిపై అగ్నిప్రమాదం జరగడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అబిడ్స్, నాంపల్లి, MJ మార్కెట్, , ఏక్ మినార్ మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఫైర్ ఇంజన్లు , అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లడానికి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు ఈ మార్గాల్లో రావొద్దని కోరుతున్నారు.
ప్రస్తుతం నాంపల్లిలో ఎగ్జిబిషన్ (నుమాయిష్) జరుగుతుండటంతో జనసంచారం విపరీతంగా ఉంటుంది. అగ్నిప్రమాదం , ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా, ఈరోజు ఎగ్జిబిషన్కు ఎవరూ రావొద్దని పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్కు రావాలని ప్లాన్ చేసుకున్న వారు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని, లేదంటే ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూనే, లోపల ఉన్న వారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాలి.
RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!