Nampally Fire Accident : అగ్నికీలల్లో ఆరుగురు.. కొనసాగుతున్న రెస్క్యూ.. ఇవాళ ఎగ్జిబిషన్కు రావొద్దన్న పోలీసులు
- నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
- మంటల్లో చిక్కుకున్న ఆరుగురు
- దట్టమైన పొగతో రెస్క్యూ కష్టాలు
- నాలుగు గంటలుగా ఆపరేషన్ కొనసాగింపు
- నాంపల్లి – అబిడ్స్ – MJ మార్కెట్లో భారీగా ట్రాఫిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని నాంపల్లిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. నాంపల్లిలోని ‘బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్’ గోదాంలో మంటలు చెలరేగి దాదాపు నాలుగు గంటలు గడుస్తున్నా, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్నీచర్ గోదాంలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో, అదే భవనంలో నివసిస్తున్న మూడు కుటుంబాలు అగ్నికీలల మధ్య చిక్కుకుపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం మొత్తం ఆరుగురు లోపల ఉన్నట్లు గుర్తించారు. వీరిలో వాచ్మెన్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అఖిల్ (7), ప్రణీత్ (11) తో పాటు, మరో కుటుంబానికి చెందిన నలుగురు పెద్దవారు ఉన్నారు. దట్టమైన పొగలు , మంటల కారణంగా లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సుమారు నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా సాగుతోంది.
CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!
Also Read
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
- TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
ప్రధాన రహదారిపై అగ్నిప్రమాదం జరగడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అబిడ్స్, నాంపల్లి, MJ మార్కెట్, , ఏక్ మినార్ మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఫైర్ ఇంజన్లు , అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లడానికి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు ఈ మార్గాల్లో రావొద్దని కోరుతున్నారు.
ప్రస్తుతం నాంపల్లిలో ఎగ్జిబిషన్ (నుమాయిష్) జరుగుతుండటంతో జనసంచారం విపరీతంగా ఉంటుంది. అగ్నిప్రమాదం , ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా, ఈరోజు ఎగ్జిబిషన్కు ఎవరూ రావొద్దని పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్కు రావాలని ప్లాన్ చేసుకున్న వారు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని, లేదంటే ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూనే, లోపల ఉన్న వారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాలి.
RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!
తాజావార్తలు
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!