Nallala Odelu: మళ్లీ గులాబీ గూటికి నల్లాల ఓదెలు దంపతులు.. కాంగ్రెస్లో మూడు నెలల ముచ్చటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గడ్డ నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్.. పార్టీని వీడిన నేతలకు మళ్లీ గులాబీ కండువాలు కప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.. అదే ఇప్పుడు కేసీఆర్ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ మధ్యే అంటే.. మే నెలలోనే టీఆర్ఎస్ను వీడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీ గూటికి చేరారు.. అయితే.. కాంగ్రెస్లో వారి జర్నీ మూడు నెలల ముచ్చటగానే మిరింది.. ఇవాళ ప్రగతి భవన్ కి వచ్చిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు.. తన భార్యత, మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మితో కలిసి మళ్లీ టీఆర్ఎస్లో చేరేందుకే వచ్చారట.. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటన జోష్లో ఉన్న గులాబీ పార్టీకి.. పార్టీని వీడినవారు కూడా మళ్లీ చేరుతుండడం.. మంచిపరిణామం అంటున్నారు..
Read Also: KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ.. ఆ అంశాలపై గులాబీ శిబిరంలో ఉత్కంఠ..!
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
కాగా, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్, తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి మే 19వ తేదీన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో ఆయన చేరిక జరిగింది. చెన్నూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓదెలు.. అనూహ్యంగా కాంగ్రెస్లో చేరడం అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లాల ఓదెలుకు టీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. తనకు బదులు బాల్క సుమన్కు టికెట్ ఇవ్వడంతో అధిష్ఠానం నిర్ణయాన్ని ఓదెలు తీవ్రంగా వ్యతిరేకించారు.. అప్పట్లో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లి నిరసన తెలపడం హాట్టాపిక్గా మారింది.. టీఆర్ఎస్లో కొనసాగితే తనకు మళ్లీ టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన ఆయన.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని టాక్ నడిచింది.. చెన్నూర్ అసెంబ్లీ టికెట్ హామీ మేరకే ఆయన కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం సాగింది.. కానీ, నాలుగు నెలలు కూడా గడవక ముందే.. మళ్లీ ఆయన కారు ఎక్కేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!