Nagoba Jatara: వైభవంగా నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన
Nagoba Jatara: మెస్రం కుటుంబీకుల కల నెరవేరింది. నాగోబా ఆలయాన్ని కొత్తగా సిద్ధం చేశారు. ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న నాగోబాకు మహా పూజలు చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం నిర్మించిన ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో మెస్రం కులస్తుల ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. గిరిజన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అష్టదీప, ఘాట్ ప్రత్యేక పూజలతో పాటు నవగ్రహ పూజలు నిర్వహించారు. నాగోబా ఆలయ పునర్నిర్మాణం పూర్తికావడంతో వారం రోజులుగా పూజలు కొనసాగుతున్నాయి. నేడు ధ్వజ స్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెస్రం ప్రజలు హాజరుకానున్నారు. మెస్రం వంశస్థులు సొంత ఖర్చులు, చందాలు వేసుకుని 5 కోట్ల తో గుడి నిర్మాణం చేయించారు మెస్రం వంశీయులు.
కేస్లాపూర్ గ్రామం నుంచి నవధాన్యాలు, పూజ సామాగ్రితో వచ్చిన మెస్రం కుటుంబ పెద్ద మెస్రం వెంకట్రావ్ పటేల్ పూజలను ప్రారంభించారు. నవధాయాలతో పాటు నవగ్రహాలను ఏర్పాటు చేసి మధ్యలో ఘాట్ను ఏర్పాటు చేసి ఎనిమిది దీపాలు వెలిగించారు. వేదిక వద్ద వెంకటరావు పటేల్ దంపతులు దీపాలు వెలిగించి హారతులతో పూజలు నిర్వహించారు. ఆదివాసీ గిరిజన వేదపండితులు ఆత్రం పురుషోత్తం, కొడప వినాయకరావుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నవగ్రహ పూజలు నిర్వహించారు. గిరిజన ఆదివాసీ దేవుళ్ల ఆలయాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో ఆలయం, కొత్తగా నిర్మించిన స్థలాలన్నింటిపై చల్లారు. నవగ్రహ పూజల్లో ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మెస్రం కులస్తులు పాల్గొన్నారు.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
Read also: FIFA World Cup 2022: ఫిఫా తుది సమరం నేడే… నువ్వా నేనా అంటున్న అర్జెంటీనా, ఫ్రాన్స్
నూతనంగా నాగోబా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న ఆలయ శుద్ధి కోసం మెస్రం వాసులు ఐదు ఆలయాల నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు. కెరమెరి మండలం విద్యాకాశం, జన్నారం మండలం గోదావరి నది సమీపంలోని హస్తలమడుగు, గుడిహత్నూర్ మండలం పులికహాచర్, బేల మండలం పెండల్వాడ, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ మర్రిచెట్ల తోపు నుంచి ఐదు మట్టి కుండల్లో పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. ఈ పవిత్ర జల కుండలను తెల్లటి వస్త్రంతో కప్పి భద్రంగా ఉంచుతారు. ఈరోజు నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా పవిత్ర జలాలను బయటకు తీస్తారు. వేడుకలను విజయవంతం చేసేందుకు 200 మంది యువకులను వలంటీర్లుగా నియమించారు. ప్రతిరోజు తెల్లని వస్త్రాలు ధరించి భక్తులకు, ప్రముఖులకు సేవలందించనున్నారు.
అయితే నిన్న కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆలయంలో పూజలు చేశారు. నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.10.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Astrology: డిసెంబర్ 18, ఆదివారం దినఫలాలు
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో