NTV Telugu Site icon

Nagar Kurnool Crime: దారుణం.. భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన భర్త..

Nagar Kurnool Crime

Nagar Kurnool Crime

Nagar Kurnool Crime: భార్యపై అనుమానంతో భర్త అమానుషంగా ప్రవర్తించాడు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రాజుకు జ్యోతి తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వీరికి ఒక కుమార్తె ఉంది. 17 ఏళ్లు సాఫీగా సాగిన వీరి జీవితంలో అనుమానం పెనుభూతంలా తాండవించింది. భర్తకు ఎందుకు భార్య జ్యోతిపై అనుమానం వచ్చిందో తెలియదు కానీ.. దీనిపై రోజూ ఇద్దరి మధ్య గొడలు జరిగేవి. ఆ గొడవలు రాను రాను పెద్దవిగా మారాయి. జ్యోతిపై విపరీతమైన అనుమాంతో సహించలేని భర్త రాజు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. నిన్న ఇంట్లో జ్యోతితో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. జ్యోతిపై కోపంతో ఊగిపోయిన రాజు అక్కడే వున్న ఇనుపరాడ్డుతో తలపై బలంగా మోదాడు. దీంతో జ్యోతి కిందికి పడిపోయింది. అంతటితో ఆగక ఆమెను విచక్షణారహితంగా కొట్టి చంపాడు. జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. భార్యను హత్య చేసి నేరుగా తన కూతురితో రాజు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్య కేసు నమోదు చేసి మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Exclusive: పెరిగిన రైల్వే వ్యయం..సేవలు అధ్వానం..రైల్వేలో ఏం జరుగుతోంది?