ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎస్సై
- ట్రాక్టర్, జేసీబీ కేసులో రూ.25 వేల డిమాండ్
- ఎస్సై అరెస్టుతో గ్రామంలో సంబరాలు, నినాదాలు
- వేధింపుల ఆరోపణలతో బాధితుల ఆగ్రహం వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ , జేసీబీని వదిలిపెట్టడానికి ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే తిమ్మజిపేట మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అది భయం వల్ల కాదు, సంతోషంతో.. ఎస్సై వేధింపులకు గురైన బాధితులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. “అవినీతి ఎస్సై డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
HYDRA : ఇందిరా పార్క్లోకి ఎంటరైన హైడ్రా.. ఆ నిర్మాణాలు కూల్చివేత..!
హరిప్రసాద్ రెడ్డి కేవలం లంచం తీసుకోవడమే కాకుండా, ప్రజలను తీవ్రంగా వేధించేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చాలామందిని డబ్బుల కోసం పీడించడమే కాకుండా, స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టేవాడని వారు వాపోయారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో ప్రతి ఊరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులకు సంబంధం లేని భూతగాదాలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు దండుకున్నాడని బాధితులు పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను వేధించే అధికారులకు ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎస్సై హరిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. రక్షక భటుడే భక్షకుడిగా మారితే ప్రజలు ఎలా స్పందిస్తారనే దానికి తిమ్మజిపేటలోని ఈ సంబరాలే నిదర్శనం.
తాజావార్తలు
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?