ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎస్సై
- ట్రాక్టర్, జేసీబీ కేసులో రూ.25 వేల డిమాండ్
- ఎస్సై అరెస్టుతో గ్రామంలో సంబరాలు, నినాదాలు
- వేధింపుల ఆరోపణలతో బాధితుల ఆగ్రహం వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ , జేసీబీని వదిలిపెట్టడానికి ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే తిమ్మజిపేట మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అది భయం వల్ల కాదు, సంతోషంతో.. ఎస్సై వేధింపులకు గురైన బాధితులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. “అవినీతి ఎస్సై డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
HYDRA : ఇందిరా పార్క్లోకి ఎంటరైన హైడ్రా.. ఆ నిర్మాణాలు కూల్చివేత..!
హరిప్రసాద్ రెడ్డి కేవలం లంచం తీసుకోవడమే కాకుండా, ప్రజలను తీవ్రంగా వేధించేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చాలామందిని డబ్బుల కోసం పీడించడమే కాకుండా, స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టేవాడని వారు వాపోయారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో ప్రతి ఊరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులకు సంబంధం లేని భూతగాదాలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు దండుకున్నాడని బాధితులు పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను వేధించే అధికారులకు ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎస్సై హరిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. రక్షక భటుడే భక్షకుడిగా మారితే ప్రజలు ఎలా స్పందిస్తారనే దానికి తిమ్మజిపేటలోని ఈ సంబరాలే నిదర్శనం.
తాజావార్తలు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారు ఏమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!