ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎస్సై
- ట్రాక్టర్, జేసీబీ కేసులో రూ.25 వేల డిమాండ్
- ఎస్సై అరెస్టుతో గ్రామంలో సంబరాలు, నినాదాలు
- వేధింపుల ఆరోపణలతో బాధితుల ఆగ్రహం వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ , జేసీబీని వదిలిపెట్టడానికి ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే తిమ్మజిపేట మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అది భయం వల్ల కాదు, సంతోషంతో.. ఎస్సై వేధింపులకు గురైన బాధితులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. “అవినీతి ఎస్సై డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
HYDRA : ఇందిరా పార్క్లోకి ఎంటరైన హైడ్రా.. ఆ నిర్మాణాలు కూల్చివేత..!
హరిప్రసాద్ రెడ్డి కేవలం లంచం తీసుకోవడమే కాకుండా, ప్రజలను తీవ్రంగా వేధించేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చాలామందిని డబ్బుల కోసం పీడించడమే కాకుండా, స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టేవాడని వారు వాపోయారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో ప్రతి ఊరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులకు సంబంధం లేని భూతగాదాలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు దండుకున్నాడని బాధితులు పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను వేధించే అధికారులకు ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎస్సై హరిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. రక్షక భటుడే భక్షకుడిగా మారితే ప్రజలు ఎలా స్పందిస్తారనే దానికి తిమ్మజిపేటలోని ఈ సంబరాలే నిదర్శనం.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!