ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎస్సై
- ట్రాక్టర్, జేసీబీ కేసులో రూ.25 వేల డిమాండ్
- ఎస్సై అరెస్టుతో గ్రామంలో సంబరాలు, నినాదాలు
- వేధింపుల ఆరోపణలతో బాధితుల ఆగ్రహం వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ , జేసీబీని వదిలిపెట్టడానికి ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే తిమ్మజిపేట మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అది భయం వల్ల కాదు, సంతోషంతో.. ఎస్సై వేధింపులకు గురైన బాధితులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. “అవినీతి ఎస్సై డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
HYDRA : ఇందిరా పార్క్లోకి ఎంటరైన హైడ్రా.. ఆ నిర్మాణాలు కూల్చివేత..!
హరిప్రసాద్ రెడ్డి కేవలం లంచం తీసుకోవడమే కాకుండా, ప్రజలను తీవ్రంగా వేధించేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చాలామందిని డబ్బుల కోసం పీడించడమే కాకుండా, స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టేవాడని వారు వాపోయారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో ప్రతి ఊరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులకు సంబంధం లేని భూతగాదాలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు దండుకున్నాడని బాధితులు పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను వేధించే అధికారులకు ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎస్సై హరిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. రక్షక భటుడే భక్షకుడిగా మారితే ప్రజలు ఎలా స్పందిస్తారనే దానికి తిమ్మజిపేటలోని ఈ సంబరాలే నిదర్శనం.
తాజావార్తలు
-
Bathroom Cleaning Tips: మీ బాత్రూమ్ గార పట్టిందా? ఇలా చేస్తే పది నిమిషాల్లో కొత్తదానిలా మార్చేయొచ్చు!
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!