Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం అక్టోబర్ 7 నుండి యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణం తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా పెరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. మరోవైపు ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని భారత విమానం ఎయిరిండియా రద్దు చేసింది. ఆపరేషనల్ కారణాలతో ఎయిర్ ఇండియా గురువారం రాజధాని నుండి టెల్ అవీవ్కు తన విమానాన్ని రద్దు చేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, భద్రత విషయమై ఈ చర్య తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రస్తుతానికి విమానాన్ని రద్దు చేసినట్లు పేర్కొంది.
ఆగస్ట్ 1న విమానం రద్దు
ఎయిర్ ఇండియా ప్రతి వారం ఢిల్లీ నుండి టెల్ అవీవ్ కు నాలుగు విమానాలను నడుపుతోంది. తన వెబ్సైట్లో టెల్ అవీవ్కు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తన వెబ్సైట్లో ప్రకటించింది. ఆపరేషనల్ కారణాల వల్ల, ఢిల్లీ నుండి టెల్ అవీవ్కి తన ఫ్లైట్ AI139, ఆగస్టు 1న టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి AI140 విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ఈ రెండు విమానాల్లో ప్రయాణించడానికి ధృవీకరించబడిన బుకింగ్లు ఉన్న ప్రయాణికులకు వారి టిక్కెట్ డబ్బు తిరిగి చెల్లించబడుతుందని ప్రకటన పేర్కొంది. ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
గతేడాది అక్టోబరు నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల, ఇరాన్ రాజధాని టెహ్రాన్లోకి ప్రవేశించి ఇజ్రాయెల్ తన అతిపెద్ద శత్రువు హమాస్ అధ్యక్షుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది. ఆ తర్వాత యుద్ధం మరింత పెరిగింది. అంతకుముందు గతేడాది అక్టోబర్ 7న హమాస్ గ్రూపు ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. ఇందులో ఇప్పటి వరకు వేలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
ఇస్మాయిల్ హనియా ఎవరు?
హమాస్ గ్రూపు అధ్యక్షుడిగా ఉన్న ఇస్మాయిల్ హనియా గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడికి పూర్తిగా ప్లాన్ చేశాడు. హనీయా ఆదేశాల మేరకు హమాస్ యోధులు పని చేసేవారు. అతను 2006 నుండి హమాస్ సుప్రీం కమాండర్. హనియా మృతిపై హమాస్ ప్రకటన కూడా వెలువడింది. హనియా మృతికి ఇజ్రాయెల్ హస్తం ఉందని ఉగ్రవాద సంస్థ పేర్కొంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!