Shocking : నాగర్కర్నూల్లో భయానక ఘటన.. అడవిలో సగం కాలిన మహిళ మృతదేహం!
- మంచాలకట్ట అటవీప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం
- గుర్తుతెలియని మహిళ శరీరం తీవ్రంగా కాలిపోవడంతో షాక్
- హత్యా? ఆత్మహత్యా? అన్న కోణాల్లో విచారణ
- ఫోరెన్సిక్ బృందం ఆధారాల కోసం దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : నాగర్కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో సగం కాలిన ఒక మహిళ మృతదేహం గుర్తించడంతో కలకలం రేగింది. అడవిలో దుర్వాసన వస్తోందని గుర్తించిన గ్రామస్థులు దగ్గరగా వెళ్లి చూసే సరికి భయానక దృశ్యం కనబడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పెంట్లవెల్లి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
Also Read
మృతదేహం తీవ్రంగా కాలిపోవడంతో మహిళ ఎవరో గుర్తించడం సాధ్యంకాలేదు. శరీరం పక్కన ఎలాంటి వస్తువులు లభించకపోవడంతో పోలీసులు మృతురాలి గుర్తింపు కోసం సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారాన్ని పంపించారు. అలాగే మిస్సింగ్ కేసుల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మహిళ హత్యకు గురై ఉంటుందా, లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో మంచాలకట్ట పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. అడవుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్..!
తాజావార్తలు
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!