Shocking : నాగర్కర్నూల్లో భయానక ఘటన.. అడవిలో సగం కాలిన మహిళ మృతదేహం!
- మంచాలకట్ట అటవీప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం
- గుర్తుతెలియని మహిళ శరీరం తీవ్రంగా కాలిపోవడంతో షాక్
- హత్యా? ఆత్మహత్యా? అన్న కోణాల్లో విచారణ
- ఫోరెన్సిక్ బృందం ఆధారాల కోసం దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : నాగర్కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో సగం కాలిన ఒక మహిళ మృతదేహం గుర్తించడంతో కలకలం రేగింది. అడవిలో దుర్వాసన వస్తోందని గుర్తించిన గ్రామస్థులు దగ్గరగా వెళ్లి చూసే సరికి భయానక దృశ్యం కనబడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పెంట్లవెల్లి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మృతదేహం తీవ్రంగా కాలిపోవడంతో మహిళ ఎవరో గుర్తించడం సాధ్యంకాలేదు. శరీరం పక్కన ఎలాంటి వస్తువులు లభించకపోవడంతో పోలీసులు మృతురాలి గుర్తింపు కోసం సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారాన్ని పంపించారు. అలాగే మిస్సింగ్ కేసుల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మహిళ హత్యకు గురై ఉంటుందా, లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో మంచాలకట్ట పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. అడవుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!