Telangana Congress AICC Secretary N.S. Boseraju made Comments on T Congress Senior Leaders Meeting.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీనియర్లకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు ఫోన్ చేసి.. సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్కు చెప్పాలన్నారు. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొదని సూచించారు. అంతేకాకుండా సమావేశం రద్దు చేసుకోవాలని, సమావేశం ఏర్పాటు చేస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని ఆయన బోస్ రాజు అన్నారు. ఈ సందర్భంగా బోస్ రాజు మాట్లాడుతూ.. సమన్వయ లోపాలు, సమాచార లోపాలు తప్పితే తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద సమస్యలు ఏమీ లేవని ఆయన అన్నారు. అవన్నీ క్రమేపీ సర్దుబాటు అవుతాయని, ప్రధాన భేదాభిప్రాయాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. అంతా బాగుంది.
నాయకులందరూ పార్టీ గెలుపు కోసమే ఆకాంక్షిస్తున్నారని, పార్టీని నష్టపరిచే ఉద్దేశం ఏ ఒక్క నాయకుడికీ లేదన్నారు. తెలంగాణ నేతలందరితో మాట్లాడుతున్నాను. అంతా పరిష్కారమౌతుందని, ఇప్పటివరకు తెలంగాణ 40 లక్షలు నభ్యత్వం నమోదు కావడం గొప్ప విషయమన్నారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఉందని, దేశంలో జరుగుతున్న పరిస్థితులను కూడా దృష్టి లో పెట్టుకుని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమిష్టి గా పోరాడి, గెలుపు కోసం కృషి చేయాలన్నారు. “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు 34 లక్షల డిజిటల్ సభ్యత్వం నమోదు కావాలని, నల్గొండ లోకసభ నియోజకవర్గ పరిధిలో 4.50 లక్షల సభ్యత్వం నమోదు కావడం కూడా ఓ రికార్డు అని ఆయన వ్యాఖ్యానించారు.
