Hyderabad: బంద్ పాటిస్తున్న ముస్లీం సంఘాలు.. పాతబస్తీలో భారీ బందో బస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలోని ముస్లిం సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు. పాతబస్తీలో మసీదు, కమిటీలు, మత పెద్దలతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తమకు నిరసనలు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ముందస్తుగా పాతబస్తీలో భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగంలోకి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది. చార్మినార్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత శుక్రవారం ప్రార్థనలు చేసిన తర్వాత ఒక్కసారిగా ముస్లింలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. రోడ్లపైకి ఒక్కసారిగా ముస్లింలు రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈరోజు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Also Read
Agneepath Scheme: సికింద్రాబాద్ విధ్వంసంపై స్పందించిన రేవంత్
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
-
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
-
CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
-
Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
-
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు