Muralidhar Rao: అన్ని మాఫియాలకు అడ్డాగా టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీతో పెట్టుకుంటే ఉండరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muralidhar Rao comments on TRS party: రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని.. అన్ని మాఫియాలకు అడ్డాగా టీఆర్ఎస్ పార్టీ మారిందని విమర్శించారు బీజేపీ నేత, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు. మొత్తం టీఆర్ఎస్ కండ బలం, ధన బలం ఉపయోగించినా..దుబ్బాకలో ఓడిపోయిందని..కోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచారని అన్నారు. వాగ్ధానాలతో మోసపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రాణాలు అర్పించడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజాశీర్వాదం ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ గుండాలతో బెదిరించి భయపెట్టాలని చూస్తే అది మీ పగటి కలే అవుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంటే వాటిని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని.. మద్యపాన నిషేధం ప్రశ్నిస్తుందని, పల్లెల్లో బెల్ట్ షాపులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లో 70 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. నిరుద్యోగ భృతి గురించి పోరాడుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయని రోజూ లేదని.. బీజేపీ ప్రతీకారం తీర్చుకునే పార్టీ… మర్చిపోయే పార్టీ కాదని హెచ్చరించారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Read Also: Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదు..!
ఈ రాష్ట్రంలో నేర్చుకున్న అనుభవాలతో దేశం మొత్తం అమలు చేయాలని మాఫియాను తయారు చేసింది నిజం కాదా..? కవిత ఇన్వెస్టిగేషన్ ఉందని అంటోందని.. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా..? అని అన్నారు. రాబోయే రోజుల్లో అగ్గి మీద నిలబెట్టి నాట్యం చేయించే రోజులు వస్తాయని..గతంలో అద్వానిని జైల్ లో పెడితే బయటికి వచ్చాక కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో గుర్తు చేసుకోవాలని.. అన్నారు. దశాబ్ధాల పోరాటం చేసే కార్యకర్తల ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే హక్కు మీకు లేదని.. బీజేపీ పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మీరుండరని.. బండి సంజయ్ కి భేషరతుగా క్షమాపణలు చెప్పి సంగ్రామ యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యక్తి కాదని.. శక్తి అని అన్నారు. ఈ నెల 27న జేపీ నడ్డాను రప్పించి సభ నిర్వహించి తీరుతామని అన్నారు. బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని.. కొత్త నాయకులతో రాబోయే రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తాం అని మురళీధర్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..