Muralidhar Rao: అన్ని మాఫియాలకు అడ్డాగా టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీతో పెట్టుకుంటే ఉండరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muralidhar Rao comments on TRS party: రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని.. అన్ని మాఫియాలకు అడ్డాగా టీఆర్ఎస్ పార్టీ మారిందని విమర్శించారు బీజేపీ నేత, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు. మొత్తం టీఆర్ఎస్ కండ బలం, ధన బలం ఉపయోగించినా..దుబ్బాకలో ఓడిపోయిందని..కోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచారని అన్నారు. వాగ్ధానాలతో మోసపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రాణాలు అర్పించడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజాశీర్వాదం ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ గుండాలతో బెదిరించి భయపెట్టాలని చూస్తే అది మీ పగటి కలే అవుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంటే వాటిని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని.. మద్యపాన నిషేధం ప్రశ్నిస్తుందని, పల్లెల్లో బెల్ట్ షాపులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లో 70 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. నిరుద్యోగ భృతి గురించి పోరాడుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయని రోజూ లేదని.. బీజేపీ ప్రతీకారం తీర్చుకునే పార్టీ… మర్చిపోయే పార్టీ కాదని హెచ్చరించారు.
Also Read
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
Read Also: Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదు..!
ఈ రాష్ట్రంలో నేర్చుకున్న అనుభవాలతో దేశం మొత్తం అమలు చేయాలని మాఫియాను తయారు చేసింది నిజం కాదా..? కవిత ఇన్వెస్టిగేషన్ ఉందని అంటోందని.. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా..? అని అన్నారు. రాబోయే రోజుల్లో అగ్గి మీద నిలబెట్టి నాట్యం చేయించే రోజులు వస్తాయని..గతంలో అద్వానిని జైల్ లో పెడితే బయటికి వచ్చాక కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో గుర్తు చేసుకోవాలని.. అన్నారు. దశాబ్ధాల పోరాటం చేసే కార్యకర్తల ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే హక్కు మీకు లేదని.. బీజేపీ పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మీరుండరని.. బండి సంజయ్ కి భేషరతుగా క్షమాపణలు చెప్పి సంగ్రామ యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యక్తి కాదని.. శక్తి అని అన్నారు. ఈ నెల 27న జేపీ నడ్డాను రప్పించి సభ నిర్వహించి తీరుతామని అన్నారు. బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని.. కొత్త నాయకులతో రాబోయే రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తాం అని మురళీధర్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!