MP Santoshkumar: మట్టికోసం మనం అంటున్న సంతోష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు సేవ్ సాయిల్ ఉద్యమం సమిష్టిగా జరిపిన సంగీత కచేరీ – మట్టి కోసం మనం ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడంతో ఈ కార్యక్రమం మొదలైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు మట్టిని రక్షించు ఉద్యమం నిర్వాహకులు ఈరోజు హైదరాబాద్లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ – మట్టి కోసం మనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టిని రక్షించు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పార్లమెంట్ సభ్యులు జె. సంతోష్ కుమార్ విచ్చేసారు.
మనస్పూర్తిగా ఈ ఉద్యమానికి తన మద్దతును అందించారు. “మేము అన్ని విధాలుగా సద్గురు చేపట్టిన మట్టిని రక్షించుకి మద్దతు ఇస్తాము. మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కారణానికి అనుగుణంగా ఉంటుంది.” అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ 25 సంవత్సరాలుగా మొక్కలు పెంపొందించడం పై అవగాహన కల్పిస్తున్నారని సీఎం కేసీఆర్ స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించానని అన్నారు. హరితహారం,గ్రీన్ఇండియా ఛాలెంజ్ తో 24 శాతం ఉన్న అటవీ శాతం 33 శాతం పెరిగిందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నదుకు ధన్యవాదాలు తెలియజేసారు.
Also Read
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని నా వంతు సాయంగా సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తాగునీరు,సాగునీరు ఇబ్బంది ఉండేది. రాష్ట్రం వచ్చాక 8 ఏండ్లలో సాగునీరు తాగునీరు ఇబ్బందులు తొలగాయని అన్నారు.నల్గొండ జిల్లా ను ఫ్లోరైడ్ రహితంగా మార్చాము.మట్టి గొప్పతనం గురించి సద్గురు చెప్పినట్లు మనం కూడా మన వంతు కృషి చేద్దామని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అంతకుముందు సందర్భాలలో మట్టి, మొక్కల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఎంపీ వివరించారు. సేవ్ సాయిల్ ఉద్యమం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మధ్య ఉన్న సారూప్యాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రముఖ గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల,రమ్య బెహ్రా , సాహితీ చాగంటి, శ్రీ లలిత, సందీప్ల ప్రదర్శనలు ప్రజలను అలరించాయి. ఆ పాటలు మట్టితో ప్రజలకు ఉన్న అనుబంధాన్ని మరొక్కసారి చూపించాయి.
కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు,రైతు నేస్తం ,ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆర్గానిక్ రైతు శ్రీ నాగరత్నం నాయుడు కూడా పాల్గొన్నారు. మట్టి ఆరోగ్యం కోసం పాటుపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మట్టి సంక్షోభాన్ని పరిష్కరించడానికి సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమం మట్టిని రక్షించు. సాగు చేయదగిన నేలలో సేంద్రియ పదార్థాలను పెంచడానికి జాతీయ విధానాలు, చర్యలను, అన్ని దేశాల నాయకుల మద్దతు తీసుకురావడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం.
మట్టి కోసం సద్గురు చేస్తున్న ఈ ప్రయాణం ఇప్పుడు 29 వ తేదీన భారతదేశాన్ని చేరుకోబోతుంది. సద్గురు యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్లోని 26 దేశాలలో ప్రయాణించిన తర్వాత భారతదేశానికి చేరుకుంటున్నారు. భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో తన బైక్ రైడ్ను సద్గురు కొనసాగించనున్నారు. సద్గురు హైదరాబాద్కు జూన్ 15 న చేరుకోబోతున్నారు. వ్యవసాయ భూముల్లో కనీసం 3-6శాతం సేంద్రీయ పదార్థాలు ఉండేలా ప్రభుత్వాలను కోరడం ఈ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇది లేకుండా, అన్ని వ్యవసాయ నేలలు వేగంగా క్షీణించి ఇసుకగా మారుతాయి, దీనిలో ఆహార పంటలు పెరగవు, ప్రపంచ ఆహార మరియు నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
ప్రపంచ జనాభా 9 బిలియన్లు దాటినా 2045 నాటికి ఆహార ఉత్పత్తిలో ఎడారీకరణ 40శాతం తగ్గుదలకి దారితీస్తుందని UN ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరించింది. UNCCD ప్రకారం, భూమి క్షీణత ప్రస్తుత రేటులో కొనసాగితే, 2050 నాటికి గ్రహం యొక్క 90శాతం ఎడారిగా మారవచ్చు – ఇప్పటి నుండి మూడు దశాబ్దాల కన్నా తక్కువ. మట్టిని రక్షించు ఉద్యమానికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ (UNCCD) సహా వివిధ ప్రపంచ సంస్థలు మరియు ఏజెన్సీలు మద్దతు ఇస్తున్నాయి; ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP); ఫెయిత్ ఫర్ ఎర్త్, UNEP చొరవ, ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) మద్దతిస్తున్నాయి.
ఆయన ప్రయాణం ప్రారంభించిన మొదటి 50 రోజులలో, ఉద్యమం ఇప్పటికే 2 బిలియన్లకు పైగా ప్రజలను చేరింది, 74 దేశాలు మట్టిని రక్షించేందుకు చర్య తీసుకోవడానికి అంగీకరించాయి. 7 కరేబియన్ దేశాలు, అజర్బైజాన్, రొమేనియా, UAEలతో సహా అనేక దేశాలు నేలను కాపాడే విధానాలను రూపొందించడానికి “మట్టిని రక్షించు “తో అవగాహన ఒప్పందాలపై (MOUలు) సంతకం చేశాయి. 54 కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, అనేక పాన్-యూరోపియన్ సంస్థలు, ముస్లిం వరల్డ్ లీగ్ కూడా సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా ముందుకు వచ్చాయి.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!