Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp Santosh Support Green India Challege Save Soil Movement

MP Santoshkumar: మట్టికోసం మనం అంటున్న సంతోష్ కుమార్

Published Date :May 28, 2022 , 9:25 pm
By NTV WebDesk
MP Santoshkumar: మట్టికోసం మనం అంటున్న సంతోష్ కుమార్
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు సేవ్ సాయిల్ ఉద్యమం సమిష్టిగా జరిపిన సంగీత కచేరీ – మట్టి కోసం మనం ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడంతో ఈ కార్యక్రమం మొదలైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు మట్టిని రక్షించు ఉద్యమం నిర్వాహకులు ఈరోజు హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ – మట్టి కోసం మనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టిని రక్షించు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పార్లమెంట్ సభ్యులు జె. సంతోష్ కుమార్ విచ్చేసారు.

మనస్పూర్తిగా ఈ ఉద్యమానికి తన మద్దతును అందించారు. “మేము అన్ని విధాలుగా సద్గురు చేపట్టిన మట్టిని రక్షించుకి మద్దతు ఇస్తాము. మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కారణానికి అనుగుణంగా ఉంటుంది.” అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ 25 సంవత్సరాలుగా మొక్కలు పెంపొందించడం పై అవగాహన కల్పిస్తున్నారని సీఎం కేసీఆర్ స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించానని అన్నారు. హరితహారం,గ్రీన్ఇండియా ఛాలెంజ్ తో 24 శాతం ఉన్న అటవీ శాతం 33 శాతం పెరిగిందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నదుకు ధన్యవాదాలు తెలియజేసారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని నా వంతు సాయంగా సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తాగునీరు,సాగునీరు ఇబ్బంది ఉండేది. రాష్ట్రం వచ్చాక 8 ఏండ్లలో సాగునీరు తాగునీరు ఇబ్బందులు తొలగాయని అన్నారు.నల్గొండ జిల్లా ను ఫ్లోరైడ్ రహితంగా మార్చాము.మట్టి గొప్పతనం గురించి సద్గురు చెప్పినట్లు మనం కూడా మన వంతు కృషి చేద్దామని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అంతకుముందు సందర్భాలలో మట్టి, మొక్కల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఎంపీ వివరించారు. సేవ్ సాయిల్ ఉద్యమం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మధ్య ఉన్న సారూప్యాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రముఖ గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల,రమ్య బెహ్రా , సాహితీ చాగంటి, శ్రీ లలిత, సందీప్‌ల ప్రదర్శనలు ప్రజలను అలరించాయి. ఆ పాటలు మట్టితో ప్రజలకు ఉన్న అనుబంధాన్ని మరొక్కసారి చూపించాయి.

కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు,రైతు నేస్తం ,ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆర్గానిక్ రైతు శ్రీ నాగరత్నం నాయుడు కూడా పాల్గొన్నారు. మట్టి ఆరోగ్యం కోసం పాటుపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మట్టి సంక్షోభాన్ని పరిష్కరించడానికి సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమం మట్టిని రక్షించు. సాగు చేయదగిన నేలలో సేంద్రియ పదార్థాలను పెంచడానికి జాతీయ విధానాలు, చర్యలను, అన్ని దేశాల నాయకుల మద్దతు తీసుకురావడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం.

మట్టి కోసం సద్గురు చేస్తున్న ఈ ప్రయాణం ఇప్పుడు 29 వ తేదీన భారతదేశాన్ని చేరుకోబోతుంది. సద్గురు యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్‌లోని 26 దేశాలలో ప్రయాణించిన తర్వాత భారతదేశానికి చేరుకుంటున్నారు. భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో తన బైక్ రైడ్‌ను సద్గురు కొనసాగించనున్నారు. సద్గురు హైదరాబాద్‌కు జూన్ 15 న చేరుకోబోతున్నారు. వ్యవసాయ భూముల్లో కనీసం 3-6శాతం సేంద్రీయ పదార్థాలు ఉండేలా ప్రభుత్వాలను కోరడం ఈ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇది లేకుండా, అన్ని వ్యవసాయ నేలలు వేగంగా క్షీణించి ఇసుకగా మారుతాయి, దీనిలో ఆహార పంటలు పెరగవు, ప్రపంచ ఆహార మరియు నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ప్రపంచ జనాభా 9 బిలియన్లు దాటినా 2045 నాటికి ఆహార ఉత్పత్తిలో ఎడారీకరణ 40శాతం తగ్గుదలకి దారితీస్తుందని UN ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరించింది. UNCCD ప్రకారం, భూమి క్షీణత ప్రస్తుత రేటులో కొనసాగితే, 2050 నాటికి గ్రహం యొక్క 90శాతం ఎడారిగా మారవచ్చు – ఇప్పటి నుండి మూడు దశాబ్దాల కన్నా తక్కువ. మట్టిని రక్షించు ఉద్యమానికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ (UNCCD) సహా వివిధ ప్రపంచ సంస్థలు మరియు ఏజెన్సీలు మద్దతు ఇస్తున్నాయి; ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP); ఫెయిత్ ఫర్ ఎర్త్, UNEP చొరవ, ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) మద్దతిస్తున్నాయి.

ఆయన ప్రయాణం ప్రారంభించిన మొదటి 50 రోజులలో, ఉద్యమం ఇప్పటికే 2 బిలియన్లకు పైగా ప్రజలను చేరింది, 74 దేశాలు మట్టిని రక్షించేందుకు చర్య తీసుకోవడానికి అంగీకరించాయి. 7 కరేబియన్ దేశాలు, అజర్‌బైజాన్, రొమేనియా, UAEలతో సహా అనేక దేశాలు నేలను కాపాడే విధానాలను రూపొందించడానికి “మట్టిని రక్షించు “తో అవగాహన ఒప్పందాలపై (MOUలు) సంతకం చేశాయి. 54 కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, అనేక పాన్-యూరోపియన్ సంస్థలు, ముస్లిం వరల్డ్ లీగ్ కూడా సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా ముందుకు వచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Green India Challenge
  • india
  • J Santosh kumar
  • sadguru

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్

  • Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

  • ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

  • Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!

  • Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions