MP Santosh Kumar : ప్రతిష్టాత్మక ‘వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్’ అవార్డు
జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రతిష్టాత్మక “వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డు వరించింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోలీహిమ్ పాల్గొని మొక్కలు నాటారు. “ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా దేశవిదేశాల్లో మొక్కలు నాటిన నా వృక్ష ప్రేమికులందరిది అన్నారు రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్”
రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న “వృక్ష మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డుల ప్రధానోత్సవంలో “ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్” మరియు “ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా” చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు అందుకోవాల్సిన సంతోష్ కుమార్.. అధికారిక కార్యక్రమాల వల్ల అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” రాఘవ, మర్ది కరుణాకర్ రెడ్డి అవార్డును స్వీకరించారు.
Also Read
అవార్డు వేడుకకు అందుబాటులో లేని కారణంగా, తన సందేశం పంపించిన సంతోష్ కుమార్, తనను అవార్డుకు నామినేట్ చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. పచ్చని ప్రకృతి కోసం మేం చేస్తున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమానికి అనేక అవార్డులు ప్రశంసలు దక్కాయి. కానీ ఇది అన్నింటికంటే ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆరవ పర్యవరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనేక పర్యవరణహిత కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ప్రకృతి ప్రేమికుడు ఎరిక్ సోలిమ్, అదేవిధంగా ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన విష్ణులాంబ చేతులమీదుగా అవార్డు అందుకోవడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ఎక్కడలేని ఎనర్జీని అందించిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!