MP Aravind: బీహార్ వెళ్లి సీఎం కేసీఆర్ తెలంగాణ పరువు తీశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Aravind comments on CM KCR: రైతులు, కార్మికులు, మహిళలు నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అరవింద్. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రశ్నించేందుకు ‘ ఇందూరు జనతా కో జవాబ్ దో’ అనే నినాదంతో ఈ నెల 3న బీజేపీ భారీ సభను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హమీల అమలుపై సీఎం కేసీఆర్ కు అరవింద్ బహిరంగ లేఖ రాశారు. సీఎం పర్యటనకు సంబంధించి తనకు ఇంకా ఆహ్వానం అందలేదని ఆయన అన్నారు. సభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
Read Also: Chiranjeevi: కొరటాలపై చిరుకు ఇంత కోపం ఉందా..?
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
దళిత, గిరిజనుల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని అరవింద్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను విస్మరించారని అన్నారు. కనీసం కేసులు కూడా ఎత్తివేయలేదని అన్నారు. బీహార్ వెళ్లిన సీఎం కేసీఆర్ తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి కేసీఆర్ని బీహార్ రానీవ్వకుండా చేసుకున్నారని అన్నారు. మూడు నెలల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు.
మరో బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ఒక డ్రామా అని ఎద్దేవా చేశారు. హిట్ పిక్చర్ చేద్దామని పోయి బొక్క బోర్లా పడ్డారని.. కాంగ్రెస్ తో ఉన్న నితీష్ కుమార్ ను కేసీఆర్ కలిశారని అన్నారు. తెలంగాన పరవును కేసీఆర్ తీశారని విమర్శించారు. తెలంగాణ సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. మోదీకి కేసీఆర్ సర్టిఫికేట్ అవరసరం లేదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ చోడో.. భారత్ జోడో దేశంలో నడుస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ మహారాష్ట్ర పోయాడు అక్కడ పనైపోయింది.. జార్ఖండ్ పోయాడు ఆయన పని కూడా అవుతుందని.. బీహార్ పోయాడు అక్కడ ఏం అవుతోందో అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే కిలాడీ చంద్రశేఖర్ రావు అని అన్నారు. కమ్యూనిస్టులు కమర్షియలిస్టులు అయ్యారని విమర్శించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..