Moosarambagh Bridge Closed: హైదరాబాద్లో కుండపోత.. పోటెత్తిన మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. హైదరాబాద్లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి… మంగళవారం.. ఇవాళ ఉదయం నుంచి మూడు నాలుగు దపాలుగా మహానగరంలో భారీ వర్షం దంచికొట్టింది… ఇక, లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లపై వాహనదారులు నరకం చూడాల్సి వచ్చింది.. అయితే, మంగళవారం నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో.. పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి… మూసీ నదిలో మళ్లీ వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహం మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వెళ్తుండడంతో.. రాకపోకలు నిలిపివేశారు అధికారులు.. ఈ మార్గం నుంచి వెళ్లే ట్రాఫిక్ను ఇతర మార్గాల్లో మళ్లించారు. ఇక, ఎప్పుడూ రద్దీగా.. వాహనాల రాకపోకలు కొనసాగించే.. ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Also: Raghunandan Rao: మేం క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదు.. స్పష్టం చేసిన రఘునందన్
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్హాట్, ఆసిఫ్నగర్, ఫలక్నూమా, చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్, ఎల్బీనగర్, అఫ్జల్గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్పేట, దిల్సుఖ్నగర్, మలక్పేట్ సహాల పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..
ఇవాళ అవ్వాల్ సర్కిల్లో 90.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా… ఎల్బీనగర్లో 84.3, మలక్పేట్ సర్కిల్ 6లో 77.5, రాజేంద్రనగర్ సర్కిల్ 11లో 71.3, మలక్పేట్ సర్కిల్ 6లో 69, షాపూర్నగర్ గాజులరామారంలో 68, ఆసమ్గాడ్లో 65.5. జీడిమెట్లలో 65.3, తిరుమలగిరిలో 63 , కుర్మగూడలో 59.3,ఫలక్నుమాలో 57.8, కుత్భుల్లాపూర్లో 57.3, శివరాంపల్లిలో 53.5, గాజులరామారంలో 53.3, ఐఎస్ సదన్లో 48.3, కూకట్పల్లిలో 48.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.. ఇది ఇవాళ ఉదయం 8.30 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం కాగా.. సిటీ వర్షం ఇంకా భారీగానే కురుస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?