Moosarambagh Bridge Closed: హైదరాబాద్లో కుండపోత.. పోటెత్తిన మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. హైదరాబాద్లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి… మంగళవారం.. ఇవాళ ఉదయం నుంచి మూడు నాలుగు దపాలుగా మహానగరంలో భారీ వర్షం దంచికొట్టింది… ఇక, లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లపై వాహనదారులు నరకం చూడాల్సి వచ్చింది.. అయితే, మంగళవారం నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో.. పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి… మూసీ నదిలో మళ్లీ వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహం మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వెళ్తుండడంతో.. రాకపోకలు నిలిపివేశారు అధికారులు.. ఈ మార్గం నుంచి వెళ్లే ట్రాఫిక్ను ఇతర మార్గాల్లో మళ్లించారు. ఇక, ఎప్పుడూ రద్దీగా.. వాహనాల రాకపోకలు కొనసాగించే.. ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Also: Raghunandan Rao: మేం క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదు.. స్పష్టం చేసిన రఘునందన్
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్హాట్, ఆసిఫ్నగర్, ఫలక్నూమా, చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్, ఎల్బీనగర్, అఫ్జల్గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్పేట, దిల్సుఖ్నగర్, మలక్పేట్ సహాల పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..
ఇవాళ అవ్వాల్ సర్కిల్లో 90.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా… ఎల్బీనగర్లో 84.3, మలక్పేట్ సర్కిల్ 6లో 77.5, రాజేంద్రనగర్ సర్కిల్ 11లో 71.3, మలక్పేట్ సర్కిల్ 6లో 69, షాపూర్నగర్ గాజులరామారంలో 68, ఆసమ్గాడ్లో 65.5. జీడిమెట్లలో 65.3, తిరుమలగిరిలో 63 , కుర్మగూడలో 59.3,ఫలక్నుమాలో 57.8, కుత్భుల్లాపూర్లో 57.3, శివరాంపల్లిలో 53.5, గాజులరామారంలో 53.3, ఐఎస్ సదన్లో 48.3, కూకట్పల్లిలో 48.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.. ఇది ఇవాళ ఉదయం 8.30 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం కాగా.. సిటీ వర్షం ఇంకా భారీగానే కురుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!