Modi visit to Hyderabadr: రెండోదశ MMTS రైళ్లు ప్రారంభించనున్న మోడీ.. ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi visit to Hyderabadr: అతి తక్కువ ఖర్చుతో నగరంలో ప్రయాణించే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈనెల 8న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా రైళ్లను ప్రారంభించనున్నారు. దీంతో మేడ్చల్ – సికింద్రాబాద్ – ఉందానగర్, మేడ్చల్ – సికింద్రాబాద్ – తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైళ్లు అందుబాటులోకి రావడం ద్వారా నగరంలోని 50 కి.మీ మేర కేవలం రూ. 10-15 టికెట్ తో ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రధాని మోదీ ఇక నుంచి నెలకోసారి తెలంగాణలో అధికారికంగా పర్యటించాలని భావిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించిన తెలిసిందే.. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం రూ.13,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏప్రిల్ 8న ప్రధాని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర అధికారుల సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని తీసుకున్నారు.
ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి రానున్న నేపథ్యంలో ఆయన రాక ఏర్పాట్లలో పార్టీ నేతలు ఇప్పటి నుంచే నిమగ్నమయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సభలో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని మోదీ కృతనిశ్చయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భాజపాను ప్రజలు ఆదరిస్తున్నారని, ఆ పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని, అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మోడీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొంటారు. అలాగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. సభ ఏర్పాట్లతో పాటు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
Also Read
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ గా సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి నడ్డా ప్రసంగించారు. సంగారెడ్డి జిల్లా కందిలో జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి. కిష న్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.
YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..
తాజావార్తలు
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!