TPCC vs Jeevan Reddy: పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు.. ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి..
- గంగారెడ్డిని జాబితాపూర్ గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి హతమార్చడు..
- పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు.. ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి..
- రేవంత్ ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు: జీవన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC vs Jeevan Reddy: కాంగ్రెస్ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని నమ్మకంగా ఉన్న మారు గంగారెడ్డి వ్యక్తిని జాబితాపూర్ గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి హతమార్చడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సంతోష్ వెనుక బలమైన శక్తులు ఉండి ఈ నేరాన్ని చేయడానికి ప్రలోభ పెట్టారు అని తెలిపారు. నిందితుడి వెనక ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారు కాబట్టే ఇలాంటి దారుణం జరిగింది అని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: CRPF Schools: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా CRPF పాఠశాలలపై బాంబులు వేస్తామంటూ బెదిరింపులు
Also Read
ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించదు అనుకున్నాను అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది.. జగిత్యాల జిల్లాలో మా కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుంది.. మేము అవమానలకు గురవుతున్నాం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది.. వెంటనే ఈ నేరానికి పాల్పడ్డ వారిని.. వారి వెనక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?