MLA Redya Naik: హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Redya Naik: హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీ మీడియా పాయింట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రెడ్యానాయక్. డోర్నకల్ లో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడాడు అంటూ మండి మండిపడ్డారు. నేను, నా కూతురు ఎటువంటి భూముల కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు 20 ఏళ్ళు భవిష్యత్ లేదు.. రాబట్టే బీఆర్ఎస్ లో చేరామని తెలిపారు. హైదరాబాద్ లో మాకు సెంటు భూమి లేదని, గతంలో కొంత భూమి కొని..తర్వాత అమ్మేసామన్నారు. గతంలో ఇదే భూమిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే. రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి నిరూపించకుంటే 10 చెప్పు దెబ్బలు తింటడా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డోర్నకల్ ప్రజలకు నా నీతి నిజాయితీ తెలుసన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మేలర్ అన్నారు. పీసీసీ పదవిని డబ్బుతో కొనుక్కున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ను రేవంత్ భ్రష్టు పట్టించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పీసీసీ అయిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారని తెలిపారు. రంగులేసినోడు వేల కోట్లకు శ్రీమంతుడు ఎలా అయ్యాడు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Revanth Reddy: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం.. కేసీఆర్కు ఇచ్చిన అవకాశం ముగిసింది..
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
అసెంబ్లీ మీడియా పాయింట్ లో..మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు యస్టీ, యస్సీ జాబితాలో చేర్చాయన్నారు. ఉమ్మడి ఏపీలో ఎస్టీలో చేర్చాలని ఉధ్యమాలు జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చెల్లప్ప కమీషన్ ఏర్పాటు చేసామని, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. తదుపరి పక్రియ కేంద్రం పరిధిలో ఉందని తెలిపారు. 1956 నుంచి వాల్మికి, బోయలు ఉధ్యమం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించని, బోయలకు న్యాయం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ మాట్లాడుతూ.. వాల్మీకి, బోయల తరుపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. బాంబులతో పేల్చేస్తామని రేవంత్, గుమటాలను కూల్చేస్తామని బండి సంజయ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీడియాలో ప్రచారం కోసం ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు మెచ్యూరిటీ లేదన్నారు. బండిసంజయ్, రేవంత్ వాఖ్యలను సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నిర్మిస్తే.. ప్రతిపక్ష నేతలు కూల్చేస్తామని చెప్తున్నారని మండిపడ్డారు. దాడులు చేయడానికి వెనకాడమన్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..